కేంద్ర క్యాబినెట్ విస్తరణ?

 

కేంద్ర క్యాబినెట్ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రథాని మన్మోహన్, యూపీయే అధ్యక్షురాలు సోనియా.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వేరువేరుగా సమావేశం కావడంతో విస్తరణ ఊహాగానాలు ఊపందుకున్నాయ్. మహాలయ పక్షాలు పూర్తై దసరా శుభ ఘడియలు వచ్చేశాయ్ కనుక మంత్రివర్గ విస్తరణకు అనుకూలం సమయం వచ్చినట్టేనని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రణబ్ ఈ నెల 20న దుర్గాపూజకోసం తన స్వగ్రామానికి వెళ్తుండడంతో ఆలోపుగానే మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని పార్టీలో సీనియర్లు అనుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు ఖాళీ చేసిన సీట్లతోపాటు డిఎంకె మంత్రులు రాజా, దయానిధి మారన్ ల సీట్లుకూడా ఖాళీగానే ఉన్నాయ్. తాము కోల్పోయిన మంత్రి పదవుల్ని తిరిగి చేపట్టే ఆలోచనేదీ లేదని కరుణానిధి తేల్చిచెప్పడంతో ఆ ఖాళీల్నికూడా పూరించడం అనివార్యమయ్యింది. రాహుల్ గాంధీకి సన్నిహితులుగా భావిస్తున్న యువనేతలకు విస్తరణలో పెద్దపీట వేయాలని సోనియా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకూ రెండు మంత్రి పదవుల్ని చూస్తున్న వాళ్లకి ఇకపై ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఏఐసీసీలోకూడా పెద్ద ఎత్తున మార్పులు చేయాలని సోనియా భావిస్తున్నారట. రాహుల్ గాంధీకి సంస్థాగతమైన కీలకపదవిని కట్టబెట్టేందుకు మేడం పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.