బీపీ ఆచార్యకి షరతులతోకూడిన బెయిల్

ఎమార్ కేసులో ప్రథాన నిందితుడైన ఐఎఎస్ అధికారి బీపీ ఆచార్యకి సీబీఐ న్యాయస్థానం షరతులతోకూడిన బెయిల్ ని మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరి పూజీకత్తులు సమర్పించాలని కోర్ట్ ఆదేశించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో మాత్రమే ఉండాలని, తర్వాతి ఉత్తర్వు వచ్చేదాకా ప్రతి శుక్రవారం కోఠీలోని సిబిఐ ప్రథాన కార్యాలయంలో ప్రతి శుక్రవారం రిపోర్ట్ చేయాలని, పాస్ పోర్ట్ ని స్వాధీనం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయ్తత్నం, సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేయకూడదని కోర్ట్ బీపీ ఆచార్యకి స్పష్టం చేసింది. బి.పి. ఆచార్యని జనవరి 30న సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రాసిక్యూషన్ కి అనుమతిలేదన్న కారణంగా సీబీఐ కారణంగా సీబీఐ కోర్టు మార్చ్ 16న షరతులతో బెయిలు మంజూరుచేసింది. దీనిపై సీబీఐ హైకోర్టుని ఆశ్రయించింది. ఆచార్యకి బెయిల్ రద్దయ్యింది. మార్చ్ 29న ఆచార్య తిరిగి సిబిఐ కోర్టుముందు లొంగిపోయారు. అప్పట్నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. చివరిసారి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ని సెప్టెంబర్ 12 న కోర్ట్ కొట్టేసింది. సెప్టెంబర్ 15న సిబిఐ అనుబంధ చార్జ్ షీట్ ని దాఖలు చేసింది. ప్రస్తుతం బీపీ ఆచార్యకి బెయిల్ మంజూరు కావడంతో ఎమ్మార్ కేసులో నిందితుల్లో జగన్ కి బాగా సన్నిహితుడైన సునీల్ రెడ్డి తప్ప మిగిలినవాళ్లందరికీ బెయిల్ మంజూరైంది.


 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.