బోస్టన్ పేలుళ్ళ కు పాల్పడిన వ్యక్తి కాల్చివేత
posted on Apr 19, 2013 @ 3:03PM
అమెరికాలోని బోస్టన్ నగరంలో బాంబు పేలుళ్ళకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతకు ముందు ఇద్దరు వ్యక్తులు 'మిట్' క్యాంపస్ లో భద్రతా సిబ్బంది పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతాదళసిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం వేట ప్రారంభించారు. దుండగులపై పోలీసులు కాల్పుల్లో ఒకరు చనిపోగా మరో వ్యక్తి పారిపోయాడు. కాల్పుల్లో హతమైన వ్యక్తిని బోస్టన్ మారథాన్ లో బాంబు పేలుళ్ళకు పలుపడిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. బోస్టన్ బాంబు పేలుళ్ళకు సంబంధించి ఎఫ్.బి.ఐ అధికారులు ఇద్దరు అనుమానితుల ఛాయాచిత్రాలను విడుదల చేశారు. సీసీటీవీ కెమెరాల విడియో ఆధారంగా వీరిని అధికారులు గుర్తించారు.