సివిల్స్ ప్రహసనంలో దాగిన డెవిల్స్!

 డా.ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]

 

 

 

కుడుము చేతికిస్తే చాలు అదే పండగనుకొనేవాడు అల్పసంతోషి! ఆరంభశూరత్వానికి ఆంధ్రుడు ఎంతపేరు మోశాడో, అల్పసంతోషానికి కూడా అంతగా అలవాటు పడిపోయాడు. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఐ.ఎ.ఎస్. సిబ్బంది రిక్రూట్ మెంట్ కోసం అఖిలభారత స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ అవసరమైన ఉన్నతస్థాయి సబార్డినేట్ స్థాయి శాఖలకు నిర్వహించే పరీక్షలు రాయగోరే అభ్యర్థులకు ఇంగ్లీషు, హిందీ భాషలలోనే రాయాలన్న నిబంధనను "ప్రస్తుతానికి నిలుపు చేసినట్టు'' ఒక వార్త [16-03-2013] వెలువడింది. గడచిన నలభైఏళ్ళుగా ఈ 'రూలు'తోనే హిందీమినహా రాజ్యాంగం గుర్తించిన 8వ షెడ్యూల్ లోని 17 ప్రాంతీయభాషల అభ్యర్థుల నోళ్ళకు 'సీళ్ళు' వేసేశారు! భారతదేశంలోని చట్టాలముందు పౌరులంతా సమానులేననీ, ఈ చట్టాల కింద అందరికీ సరిసమాన రక్షణ ఉంటుందనీ, ప్రభుత్వ ఉద్యోగ సద్యోగాలలో సర్వులకూ సమానావకాశాలుంటాయనీ హామీపడిన రాజ్యాంగంలోని 14-16 అధికరణలకు విరుద్ధంగా కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహణకు, ఉద్యోగాల్లో అభ్యర్థుల నియామకాలకు బాధ్యత వహించవలసిన స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్.ఎస్.సి.) వ్యవహరిస్తూవచ్చింది. దీని పర్యవసానంగా దక్షిణాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కేంద్ర-రాష్ట్ర సర్వీసులకు లక్షలసంఖలోనే ఉద్యోగార్హులుకాగల అవకాశమున్న యువకులు ప్రాంతీయ భాషలయిన మాతృభాషలకు దూరంకావలసివచ్చి ఉపాధి కోల్పోయారు!

 

 

40 ఏళ్ళుగా రాష్ట్రప్రభుత్వాలు స్థానిక భాషలలో కేంద్ర సర్వీసులకు పరీక్షలను (ప్రిలిమ్స్/మెయిన్) నిర్వహించే విషయాన్ని పట్టించుకోకుండా "గుడ్లు అప్పగించి'' చూస్తూ ఉన్నందున ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 2011 వరకూ సుమారు 4 లక్షలమంది యువకులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని అంచనా! ఇప్పటికైనా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పాక్షిక విధానాన్ని కేంద్రమూ, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ శాశ్వతంగా నిరోధించి, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు ప్రాంతీయ భాషలలో కూడా సివిల్ సర్వీసు పరీక్షలను, ఇంటర్వ్యూలనూ, నియామకాలనూ నిర్వహించకపోతే జాతీయ సమైక్యతా భావనను సంరక్షించడం ఉత్తరోత్తరా సాధ్యపడకపోవచ్చు. ఈ మాట ఎందుకు అనవలసి వస్తోందంటే, దక్షిణాది రాష్ట్రాలు సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు (బీహార్ వగైరా) కూడా ఎస్.ఎస్.సి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమించడంవల్ల 05-03-2013 నాటి సివిల్స్ నోటిఫికేషన్ ను తాత్కాలికంగా ("ప్రస్తుతానికి'') నిలిపి ఉంచారుగాని, దాని ఉపసంహరణ మాత్రం జరగలేదని గుర్తుంచుకోవాలి.


ఆ నోటిఫికేషన్ ఉపసంహరణ జరిగి, యావద్భారతంలోనూ రాజ్యాంగం హామీపడిన ప్రాంతీయ భాషలలో కూడా యూనియన్, రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ లు నిర్వహించే పరీక్షలను రాయడానికి అభ్యర్థులకు అధికారికమైన ఏర్పాట్లు జరిగేదాకా యువకులు విశ్రమించరాదు. ఎందుకంటే, ఇప్పటికీ, నోటిఫికేషన్ కేవలం "తాత్కాలిక నిల్పివేత'' [నోటిఫికేషన్ పుటాన్ హోల్డ్] జరిగిన తరువాత కూడా "సామర్థ్యం'' పేరిట, "సంభాషణా నైపుణ్యా''ల పేరిట, "అవగాహనశక్తి'' పేరిట, "గ్రహ్యశక్తి''. "సంక్షిప్తీకరణ యోగ్యతా'' వగైరాల పేరిట ప్రాంతీయ భాషలను అవమానపరిచే ప్రయత్నం కొందరు ఉన్నతాధికారులు మానుకోలేకుండా ఉన్నారు! ఉదాహరణకు నోటిఫికేషన్ "తాత్కాలిక నిలుపుదల'' వార్త వచ్చిన మరునాడే [17-03-2013] యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ పూర్వాద్యక్షుడు అరుణ్ నిగావేకర్ ఓ విచిత్రమైన "కప్పదాటు'' ప్రకటనతో ముందుకొచ్చాడు. సర్వీస్ కమీషన్ పరీక్షలను, ఇంటర్వ్యూలనూ కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే నిర్వహించాలన్న నోటిఫికేషన్ జారీ చేయడానికి సిఫారసు చేసిన "నిపుణుల కమిటీకి'' ఇంతకుముందు సారథ్యం వహించిన వ్యక్తి ఈ నిగావేకరే!



నిజానికి ఇతర ప్రాంతీయ భాషలలో పరీక్షలను, ఇంటర్వ్యూలను నిరోదిస్తున్న నిరంకుశ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఈ - వేళ కాదు ఎనిమిదేళ్ళ క్రితమే క్రితమే [2004లో] సోదర ప్రముఖ పాత్రికేయుడు, సామాజిక కార్యకర్త సుభాష్ చంద్రన్, నేనూ ఆందోళన లేవనెత్తాం. సుభాష్ చంద్రన్ సర్వీస్ కమీషన్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ రాష్ట్ర హైకోర్టులో కీలకమైన రిట్ వేయగా [రిట్ నెం డబ్యు.పి.11000/2004] నేను దానికి దన్నుగా రచనాపరంగా ఆందోళన చేపట్టాను. రిట్ ను స్వీకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కూ నోటీసులు జారీ చేయడమూ తరువాత పరీక్షలు, ఇంటర్వ్యూలను తెలుగు సహా దక్షిణాది ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న కోర్కెలోని సామంజస్యాన్ని సమర్థించడమూ జరిగింది. దానితో చెన్నై కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాలలో పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూచే సర్వీస్ కమీషన్ సంచాలకుడు మన రాష్ట్ర హైకోర్టుకు లేఖరాస్తూ "పిటీషనర్ల డిమాండ్ మేరకు రాజ్యాంగం 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ప్రాంతీయ భాషలలో దేనిలోనైనా సరే అభ్యర్థులు సమాధాన పత్రాలు రాయడానికి ప్రభుత్వం ఇప్పుడు సమ్మతించింద''ని తెలిపాడు!
 



అయినా సరే "కుక్కతోక వంకర'' అన్నట్టుగానే ప్రాంతీయ (మాతృ) భాషలలో సర్వీస్ కమీషన్ ప్రిలిమ్స్, మెయిన్ తుది పరీక్షలు రాయకుండా అభ్యర్థులను నిరోధిస్తూ సర్వీస్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ ఈసారి కూడా జారీ చేసిందంటే పాలనా నియంత్రణ వ్యవస్థ ఎలా పతనోన్ముఖంగా ప్రయాణిస్తోందో అర్థమవుతుంది. ఇంతకుముందొకసారి సుప్రీంకోర్టు సహితం [రాధేశ్యామ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు] ఇలాంటి నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమనీ, జోనల్ పద్ధతిపైన విడివిడిగా పరీక్షలు నిర్వహించడం "సమానత్వ సూత్రానికే విరుద్ధమ''నీ సర్వీస్ కమీషన్ లాంటి అఖిలభారత స్థాయి సంస్థలకు రిక్యూట్ మెంట్ పరీక్షలను ఏకకాలంలో దేశమంతటా ఒకేసారి నిర్వహించాలనీ ఆదేశించిందని మరవరాదు. కానీ నిగావేకర్ తన కమిటీ సిఫారసును పరోక్షంగా సమర్ధించుకోడానికి 'రూటు'మార్చి ఒక ప్రకటనలో "ఫలానా భాషలోనే సివిల్స్ పరీక్షలను నిర్వహించాలని కమిటీ నొక్కి చెప్పలేద''ని అంటూనే మరొక మెలిక పెట్టాడు : "అభ్యర్థులు సంభాషణా సామర్థ్యాల్ని (కమ్యూనికేషన్ స్కిల్స్) పరీక్షించి మరీ నిర్ణయం చేయాల''ని మాత్రమే కమిటీ కోరిందని చెప్పాడు! కాని ఆ వెంటనే మరొక ఉన్నతాధికారేమో "కమిటీ పరిశీలనకు నివేదించిన అంశాలలో భాషా సమస్యే లేద''ని 'కథ' వినిపించడానికి ప్రయత్నించాడు!


అయినప్పుడు మెడమీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడికీ వెంటనే స్ఫురించే ప్రశ్న : "అయితే మరి ఇంతకూ ప్రాంతీయ భాషలలో పరీక్షలను అడ్డుకుని సివిల్స్ ను కేవలం ఇంగ్లీషు, హిందీ భాషలలో మాత్రమే రాయాలన్న నిబంధనను చేర్చిందెవరు? లేదా 'రూల్స్'ను మార్చిందెవరు?'' అని! దేశ స్వాతంత్ర్యం అప్పనంగా అర్థరాత్రి పూట చేతికి బదిలీ అయినట్టే, పాలకులు, అధికారగణం బుద్ధులు కూడా వలసపాలనా వశేషంగా అప్పనంగా సంక్రమించాయి! దాని ఫలితమే నేటి సర్వవ్యాపిత సంక్షోభంలో భాగంగా "చుట్టుచూపు లేని'' విద్యలు, విద్యావిదానాలూ ఏలినాటి శనిగా, ఎలేనాటి శనిగా పీడించడం! సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్ తాత్కాలికంగా మాత్రమే నిలిపివేశారనడానికి మరొక ఉదాహరణ - ఆ యు.జి.సి. మాజీ చైర్మన్ నిగావేకర్ "ప్రపంచీకరణ'' నేపథ్యంలో మాట్లాడుతూ "21వ శతాబ్దపు సివిల్ సర్వెంటు (ఉన్నతాధికారి, అంటే ఇంగ్లీషు చదవరి) వర్తమాన ప్రపంచంనుంచి ఎదురయ్యే అనేక రకాల సవాళ్ళను ఎదుర్కోవడానికి తగిన లక్షణాలు, అర్హతలూ కలిగి ఉండాల''ని ఒక షరతును ముందుకు నెట్టడం! అంటే, మరొక మాటలో, మాతృభాష లేదా 'ప్రాంతీయ భాష నీకు బువ్వపెట్టదు, ఉద్యోగమివ్వదు, కాబట్టి ఇంగ్లీషో, హిందీయో రాకపోతే అసలు నీకు బతుకే లేదు' పొమ్మని చెప్పడమే!
 



నిజానికి, ఏ సమాచార సాంకేతిక వ్యవస్థ ఆధారంగా ఐ.టి.రంగం దండిగా బువ్వపెడుతుందని, రెండు చేతులూ రెండు జేబులూ కాసులు నింపుతుందని భ్రమింపజేసి అమెరికా పాలకులు తమ బాడుగుపనులను (ప్రోగ్రామింగ్ వగైరా) మనకు అప్పగించారో ఆ పనులను కాస్తా అమెరికాలో తామెదుర్కొంటున్నతీవ్ర నిరుద్యోగ పరిష్కారంలో భాగంగా రేపో మాపో నిలిపివేయక తప్పదని ప్రెసిడెంట్ ఒబామా యిప్పటికీ పదే పదే బెదిరిస్తున్నాడు! పైగా శృతిమించిన ఐ.టి. మోజులో పడిపోయిన మన పాలకులు, బ్యూరోక్రాట్లు దేశంలో భారీ ఎత్తున కోట్లాదిమందికి ఉపాధిని కల్పించగల వ్యవసాయక, వస్తూత్పత్తి (మాన్యుఫాక్చరింగ్), లఘుపరిశ్రమల రంగాలను 'మాడ' బెట్టారు! ఇప్పుడు మన దేశ పరిస్థితి - "తల్లినీతండ్రినీ చంపి వచ్చి అయ్యా నేను తల్లీతండ్రీ లేనివాడిని, ఆదుకోండ''ని మొట్టుకున్నట్టు అయింది! స్థానిక పాలనా సంస్థలు, గ్రామస్థాయి వరకూ సామాన్య ప్రజల అవసరాలు, వారి అవసరాలను గురించి తెలుసుకోడానికి ఉపయోగించాల్సిన సంభాషణా మాధ్యమం ఏది, ప్రజాసమస్యల పరిష్కారంలో ఏ భాషా మాధ్యమం ద్వారా ప్రజాబాహుళ్యాన్ని సమీకరించాలన్న ప్రశ్నలే, ఆచార్య నిగావేకర్ లాంటి "వేతనకర్మ''లకు అనవసరం!
 



పైగా "నేడు వీస్తున్న పరివర్తనా వాయువులకు అనుగుణంగా'', అంటే, "ప్రపంచభాష అయిన ఇంగ్లీషు భాషకు కిటికీలను బాహాటంగా తెరిచి ఉంచాల''నీ, నేడు "ప్రపంచ సరిహద్దులు చెరిగిపోయి, ఇంగ్లీషే చలామణీలో ఉన్న ఈనాటి కరెన్సీ'' అనీ, అదే వెలుగూ, జిలుగూ, అదే కాంతీ, అదే ధ్వనీ (లైట్ అండ్ సౌండ్) అనీ నిగావేకర్ పూనకం పూనారు! ఈ సందర్భంగా ఆయన మరొక అబద్ధాన్ని కూడా వ్యాపింప చేయడానికి వెనుకాడలేదు: "అన్ని వైపులనుంచి శుభ్రపవనాలను-ఆరోగ్యకర గాలుల్ని-వీచనివ్వండి'' అని గాంధీజీ మతమౌఢ్యంతో తీసుకుంటున్నవారికి హెచ్చరికగా వాడిన మాటల్ని వక్రీకరించుతూ "గాంధీజీ కోరుకున్నది ఈ మార్పునే''నని భాషాపరంగా వర్తింప చేయడానికి నిగావేకర్ ప్రయత్నించాడు! కాని, ఇంగ్లీషు భాషా బోధనా గురించి, మాతృభాషలను పణంగా పెట్టి దానిని పెంచాలన్న దేశీయ ఆంగ్ల విద్యాధికుల ప్రయత్నాలను గాంధీజీ వ్యతిరేకిస్తూ ఎలా హెచ్చరించవలసి వచ్చిందో ఈ క్రింది గాంధీజీ మాటల్లోనే నిగావేకర్ వినడం మంచిది:
 


"భారతీయ విద్యార్థులు ఒక విదేశీభాషను (ఇంగ్లీషును) పాఠశాల తరగతుల్లో నేర్చుకోడానికి వారానికి ఏడుగంటల శ్రమను వృధా చేసుకుంటున్నారు. ఈ దేశానాయకులు పవిత్రమైన ప్రజల విశ్వాసాన్ని కాస్తా వమ్ము చేస్తున్నారు. ఒక భాషగా నేర్చుకోడానికి ఇంగ్లీషు పట్ల నాకు వ్యతిరేకత లేదు. కానీ దేశీయ మాతృభాషలను చంపి వాటి సమాధిపైన ఇంగ్లీషుభాషను మీరు రుద్ద దలిచితే 'స్వదీషీ'భావాన్ని మీరు సరైన అర్థంలో అనుసరించడం లేదని నేను స్పష్టం చేయదలచాను. ఏ దేశమూ తన సొంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేదు. వీరికి ఎంతసేపూ ఇంగ్లీషు విద్యావ్యాప్తిని గురించిన గొడవే. కాని మనం అసలు సమస్యను మరచిపోరాదు - గత అనేక దశాబ్దాల కొలదీ మన తల్లిభాషలోనే మనం విద్య పొందుతూ [ఇంగ్లీషు ఒక భాషగా నేర్చుకోడానికి అవకాశం కల్పిస్తూనే] వస్తున్నామే అనుకోండి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉండేది? మనకీపాటికే స్వేచ్చాభారతం ఏర్పడి, మన సొంత విద్యావంతులు మనకు తయారై ఉండేవారు. అప్పుడు తమ సొంత నేలపైన తామే విదేశీయులుగా గడపాల్సిన పని మనకి ఉండేది కాదు; అలా సొంత భాషను గుండెగొంతుకలో పలికించడం ద్వారా నిరుపేదల మధ్యకు చొరబడి బాగా పనిచేయగలిగి ఉండేవారు.
 



ఆ అనుభవం జాతి భద్రపరచుకోదగిన వారసత్వ సంపదై ఉండేది. కాని ఈ రోజున మనం పరాయిభాషకు అలవాటు పడినందున, మన మంచి భావాలను చివరికి మన భార్యలు కూడా పంచుకోగల స్థితిలో లేరు! అంతేగాదు, మన విద్యాధిక వర్గమంతా విదేశీ (ఇంగ్లీషు) భాష ద్వారానే విద్యావంతులయినందున దేశ ప్రజాబాహుళ్యం సమస్యలపైనగాని, వారి కోర్కెల గురించిగానీ మనలో స్పందన లేకుండా పోయింది. ఎందుకని? మన ప్రజాబాహుళ్యం ఇంగ్లీషు ఆఫీసర్లను గుర్తించిన దానికన్నా మించి మనల్ని గుర్తించడంలేదు గనుక ఫలితం? అటు ఇంగ్లీషు నేర్చిన అధికారులతోనూ, ఇటు మనతోనూ కూడా ప్రజలు మనసువిప్పి మాట్లాడలేకపోతున్నారు. కనుకనే ప్రజల అవసరాలు, కోరికలు మనవి కాకుండా పోయాయి. అన్ని రకాల విజ్ఞాన శాఖలలోనూ మాతృభాషలోనే బోధనా జరిగి ఉంటే ఈ సరికి ఆ శాఖలన్నీ అద్భుతంగా పరిపుష్టమై ఉండేవి. ఆ పనే జరిగి ఉంటే, గ్రామ పంచాయితీలు తమ ప్రత్యేక పద్ధతుల్లో నేడు సజీవశక్తులుగా మనగల్గుతూ ఉండేవి; అదే జరిగి ఉంటే, భారతదేశం స్థానిక అవసరాలకు తగినట్టుగా స్వపరిపాలనా దిశలో, సౌభాగ్యదశలో ఉండేది; అదే జరిగి ఉంటే, తన పవిత్ర భూమిపైన పనిగట్టుకుని మాతృభాషల హత్య అనే అవమానకరమైన దృశ్యాన్ని చూడకుండా దేశప్రజలు తప్పించుకొగలిగేవారు. నాకు ఇంగ్లీషుపైన ద్వేషంలేదు. కాని నాబాధల్లా మాతృభాషల స్థానాన్ని తాను ఎన్నటికీ పొందలేని ఇంగ్లీషుకు అవసరాలకు మించిన ప్రాధాన్యం యివ్వడానికి చేసే ప్రయత్నం గురించే. మాతృభాషలను విస్మరించితే దేశాన్ని భాషా దారిద్ర్యం ఏలడం ఖాయం!''
 


అంతేగాదు, నిగావేకర్ మరొక అబద్ధాన్ని కూడా ప్రచారంలో పెట్టడానికి సాహసిస్తున్నాడు : "ఒక దశాబ్దం కిందటి దాకా చైనా, జపాన్ లు కూడా ఇంగ్లీషుపైన కేంద్రీకరించకుండానే అభివృద్ధిని సాధించాయ''ని ఒప్పుకుంటూనే ఆయన "ప్రపంచపోటీని తట్టుకోడానికి'' ఇంగ్లీషు భాషను ఒక సాధనంగా గుర్తిస్తున్నాయ''ని ఒక 'టూమ్రీ' వదిలాడు! కాని ఈ రోజుకీ ఆ రెండు దేశాలూ ఇంగ్లీషును కేవలం వాణిజ్యభాషగానే వినియోగించుకుంటున్నాయనిగాని పాఠశాల దశలనుంచి పట్టభద్ర, పట్టభద్రానంతర దశలవరకూ చైనీస్, జాపనీస్ భాషలలోనే విద్యాబోధ జరుగుతోందని ఈ పెద్దమనిషి మరచిపోకూడదు.



రేపో మాపో చైనా, ప్రపంచంలోకెల్లా ఆర్థికరంగంలో ఇప్పటికి ప్రథమస్థానంలో అగ్రేసరశక్తిగా ఉన్న అమెరికాను తోసిరాజనబోతోందని అమెరికన్ ఆర్థిక నిపుణులు, అమెరికా, బ్రిటన్, జర్మనీ పాలకులే ప్రకటిస్తున్నారు. అందుకు తగినట్టుగానే రేపటి వాణిజ్యభాషగా చైనీస్ భాష దూసుకు వస్తున్నందున, ఈ మూడు అగ్రరాజ్యాలూ తమ దేశాలలో వందలాదిగా చైనీస్ భాషాధ్యయన పాఠశాలలు ఎందుకు తెరవవలసి వచ్చిందో నిగావేకర్ వివరిస్తే బావుంటుంది!  దూసుకువస్తున్న రేపటి చైనీస్ భాషను కూడా ఇంగ్లీషులాంటి వాణిజ్య భాష మాత్రమే కాగల్గుతుందిగాని దేశీయ మాతృభాషల స్థానాన్ని తోసిపుచ్చజాలదు!


 
అంతేగాదు, ఇంగ్లీషుభాష మాత్రమే ఉపాధి అవకాశాలు పెంచగలదన్న భ్రమలో పడిన నిగావేకర్ లాంటి విద్యాధికులు అమెరికా, బ్రిటన్ లాంటి "అభివృద్ధి'' చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో అక్కడి పాలనా, బోధనా భాషగా శతాబ్దాల తరబడిగా ఉన్న ఇంగ్లీషు, ఆ దేశాలలో రోజుకొక తీరుగా రెండు అంకెల జోడుగుర్రాలపైన పరుగెత్తుతున్న నిరుద్యోగ సమస్యను (10 నుంచి 11 శాతం దాకా) ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయో కూడా నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి; పెట్టుబదీదారీ విధానాలవల్ల ముమ్మరించి దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆ దేశాల ఆర్థిక సంక్షోభంలో పెట్టుబడి వ్యవస్థకు మూలవిరాట్టుగా ఉన్న వాల్ స్ట్రీట్ గుత్తవ్యాపార వానిజ్యపు ఆయువుపట్టును నొక్కడానికి "ఆక్యుపై ది సిస్టమ్'' అన్న (వ్యవస్థా మార్పుకోసం ఆక్రమణోద్యమం) నినాదంతో విద్యాధికులయిన నిరుద్యోగాలు ఎందుకు ప్రయత్నించవలసి వచ్చిందో నిగావేకర్ సమాధానం చెప్పగలగాలి!



కాని అమెరికా ఆర్థిక విశ్లేషకులలో ప్రసిద్దుడయిన ప్రొఫెసర్ మైఖేల్ యేట్స్ తాజా అంచనాల ప్రకారం, 2009-2011 మధ్యకాలంలో అమెరికా జాతీయోద్యమంలో 88 శాతం కార్పోరేట్ గుత్తసంస్థల లాభాల కింద స్వాహా అయింది; కాగా కేవలం 1 శాతం ఆదాయం మాత్రమే ఉద్యోగవర్గాల వేతనం కింద జమ అయింది! వ్యక్తిగత ఆదాయాల్లో మొత్తం ఆదాయ పెరుగుదలలో 93 శాతం ఆదాయం జనాభాలో కేవలం ఒక్క శాతంగా ఉన్న సంపన్న అమెరికన్ల హక్కుభుక్తమై పోయింది! అమెరికా విధాన నిర్ణయాలలో కీలకపాత్ర వహించే అమెరికన్ గూఢచారి సంస్థ (సి.ఐ.ఎ) నిర్వహిస్తున్న "వరల్డ్ ఫేస్ బుక్'' అంచనా ప్రకారం నేడు ఇంగ్లీషు ప్రపంచభాషా కేంద్రంలో ఒకటైన అమెరికాలో ప్రబలిపోయిన ఆర్థిక అసమానతలు ఏస్థాయికి వెళ్ళాయంటే చిన్నదేశాలయిన ఐవరీకోస్టు, కామెరూన్ దేశాలకన్నా అమెరికాను వెనకపడేశాయి, ఇక అసమానతలలో ఉగాండాకన్నా అమెరికా ఓ మెట్టు కొంచెం పైస్థాయిలో మాత్రమే ఉంది! ఇక ఇంగ్లీషుకు శిష్టాది గురువుగా భావించుకుంటున్న అదే అమెరికాలో 2001 తర్వాత ఈరోజు దాకా మొత్తం ఉద్యోగాల సంఖ్యా పెరగనేలేదు. 16-50 సంవత్సరాల మధ్య వయస్సుగల ప్రతి ఒక్క వయోవిభాగంలోనూ ఉపాధి పొందినవారి సంఖ్య "సముద్రంలో నీటిబొట్టు''తో సమానమని నిపుణుల అంచనా! విచిత్రమేమంటే, ఈ ఆంగ్లభాషా కేంద్రం (అమెరికా)లో కార్పోరేట్ రంగం చెల్లించవలసిన పెన్షన్ ల విషయంలో అనుసరిస్తున్న దోపిడీ పద్ధతుల మూలంగా వృద్ధాప్యంలో ఉన్న కార్మికులు మాత్రమే ఎక్కువ శ్రమించవలసి రావటం! ఇక 16-29 సంవత్సరాల మధ్యవయస్సులో ఉన్న యువతకు ఉపాధి బాగా దూరమైపోయింది! కళాశాలల నుంచి వచ్చే పట్టబద్రులలో మెజారిటీ నిరుద్యోగులుగా ఉండిపోవలసివస్తోంది, లేదా డిగ్రీ అవసరంలేని పనులకయినా ఎగబడాల్సి వస్తోందని అంచనా!



[2011 డిసెంబర్ 15: అసోసియేటెడ్ ప్రెస్]! ఆంగ్లభాషా కేంద్రమైన అదే అమెరికాలో కళాశాలల పట్టభద్రులు అసంఖ్యాకంగా ఉపాధి దొరకక తిరిగి ఇళ్ళదారి పడుతూండటం మరొక విశేషం! అతి చిన్న దేశాలయినా, అమెరికానుంచి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను 50 ఏళ్ళకుపైగా ఎదుర్కొంటున్న క్యూబా, వెనిజులాల్లో విద్య, వైద్య, ఉపాధిరంగాలను ఎంతటి సామర్థ్యంతో నిర్వహించుకుంటూ ప్రపంచప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారో మన పాలకులు, బ్యూరోక్రాట్లూ తెలుసుకోవటం శ్రేయస్కరం! తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుడుతూనే ఉందట, తెలుకొండిలాంటి నిరంకుశాధికారవర్గం కనుసన్నల్లో జరిగే తంతు కూడా అంతే! నోటిఫికేషన్ "నిలుపుదల'' ఉపసంహరణ కాదు, స్పష్టమైన జీ.వో. విడుదలయ్యేదాకా అల్పసంతోషం అల్పాయుర్థాయం లాంటిది! ఇంతవరకూ కేంద్రప్రభుత్వంగాని యు.పి.ఎస్.సి.గానీ జీ.వో. విడుదల చేసినట్టు వార్తలేదు, నోటి ప్రకటనలు తప్ప!

 
 

ఏఎస్ఐ పై దాడికి పాల్పడ్డ గంజాయి బ్యాచ్

  నగరంలో రోజు రోజుకీ గంజాయి బ్యాచ్ లు రెచ్చిపో తున్నాయి. యువ కులు గంజాయి సేవించి ఆ మత్తులో తూగుతూ ఇతరు లపై దాడి చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు... ఈ గంజాయి బ్యాచ్ రోడ్డు మీద చేసే గొడవ వల్ల వాహ నదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా బండ్లగూడ పరిధిలో గంజాయి బ్యాచ్ నడిరోడ్డు మీద చేసిన హంగామా వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరు యువకులు గంజాయి సేవించి ఆ మత్తులో తూలుతూ బండ్ల గూడ పరిధిలోని చాంద్రాయణ గుట్ట వద్ద ఉన్న ఏఎస్ఐ తో గొడవపడ్డారు. అంతటితో ఆగ కుండా ఏ ఎస్ ఐ చొక్కా పట్టుకొని నన్ను మీరు ఏమీ చెయ్యలేరు రా అంటూ రెచ్చిపోతూ అతనిపై దాడి చేశారు... దీంతో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరిని కొట్టాడు.  మమ్మల్ని కొడతావా అంటూ ఏ ఎస్ ఐ పై దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకు న్నారు. ఈ దాడుల్లో గంజాయి మత్తులో ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికం గా హంగామా రేగ డం తో స్థానికులు పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయా లైన యువకులకు నచ్చజెప్పి పోలీస్ వాహనం ఎక్కించేం దుకు విశ్వ ప్రయ త్నం చేశారు.. అదే సమయంలో యువ కులు పోలీసుల ట్యాబ్ ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువ కులు పోలీస్ వాహనం ఎక్కేం దుకు ససేమిరా అంటూ పోలీసు లకు చుక్కలు చూపించారు..  పోలీసు వాహనం ఎక్కకుండా దాదాపు అరగంట పాటు ఆ యువ కులు  పోలీసులను నానా తిప్పలు పెట్టారు. అయినా కూడా పోలీసులు ఓపిగ్గా ఆ ఇద్దరు యువకులకు పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి చికిత్స చేపించి అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

గాంధీ అనే పదం భారత దేశానికి పర్యాయ పదం : సీఎం రేవంత్

  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం సద్భావన యాత్ర చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. “మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశ సేవలో అంకితమై ఉంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి గాంధీ అనే పేరు పర్యాయ పదం” అని సీఎం రేవంత్ అన్నారు. సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందజేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. “సల్మాన్ ఖుర్షీద్ కుటుంబానికి గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. ఈ అవార్డు ఆయనకు దక్కడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతకు అధిక హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు: “18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. అదే రాజీవ్ గాంధీ కల.” ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అదే కుట్ర జరుగుతోంది.  వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖుర్షీద్‌ మాట్లాడుతు తనకు ఎంతో ప్రత్యేకమని తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్‌ తెలిపారు.

పిఠాపురం వర్మ.. మంత్రి నారాయణ వివాదానికి ఎండ్ కార్డ్

మంత్రి నారాయణ, పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ వర్మ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేసేశామని వ్యాఖ్యానించారంటూ, అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియోపై స్పందించిన వర్మ కూడా ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన తాను జీరో కానని అన్నారు. అయితే ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది. మంత్రి నారాయణ తాను టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలను ఎవరో ఎడిట్ చేసి, కట్ చేసి , పేస్ట్ చేసి తాను వర్మ విషయంలో ఏమో మాట్లాడినట్లుగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని   క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే  విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆ వీడియోపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడంతో వర్మ సంతృప్తి చెందారు. దీంతో వివాదం సమసింది. కాగా మంత్రి నారాయణ తాను ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినదంతా బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణ ఎలా జరిగిందో, తాను అనని మాటలను అన్నట్లుగా ఎలా సృష్టించారో అర్ధమయ్యేదని వివరించారు.   అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి మా మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా సాధ్యం కాదని నారాయణ చెప్పారు. ఇక వర్మ వివాదమేం లేదని ప్రకటించడమే కాకుండా, పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు లేవనీ, రెండు పార్టీలూ సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు.  ఈ సందర్భంగా వర్మ చంద్రబాబు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతానని చెప్పారు. మంత్రి నారాయణ తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అభూత కల్పనలు ప్రచారం చేశారనీ,  అటువంటి అసత్య ప్రచారాలను తాను పట్టించుకోననీ అన్నారు.   కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి తరం కాదని వర్మ పేర్కొన్నారు.  

కాంగ్రెస్ అభ్యర్థికే మా మద్దతు.. అసదుద్దీన్ ఒవైసీ

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో మస్లిస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీజేపీని నిలువరించేందుకే తాము జూబ్లీలో పోటీ చేయకుండా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు.  ఆ సందర్భంగా ఒవైసీ నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉందనీ, ఆ పదేళ్లూ కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గం మాత్రం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి ఒక అవకాశమన్నారు.   నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు సూచించారు. . నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీచేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయన్న ఒవైసీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  

వైసీపీ ఫేకు ప్రచారంపై కేంద్రం సీరియస్!

ప్రధాని నరేంద్రమోడీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విధానాలపై ప్రధాని నరేంద్రమోడీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలోనే ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది.  అసలింతకీ విషయమేంటంటే..   ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజా ప్రతినిథులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే  స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌ విరూపాక్షి,   ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జడ్పీ చైర్మన్ కు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధాని పుష్పగుచ్ఛం ఇచ్చారు.    కానీ వారు ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తాను ప్రధాని మోడీకి   రాష్ట్రంలో  మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ, ప్రభుత్వ విధానాలపై ప్రధానికి వినతిపత్రంలో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు.  అయితే తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రొటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు.  ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ వ్యహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతిపత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించిందెవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒక వేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలిసే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్రం వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  

ఆంధ్రా పచ్చళ్లే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే!

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారడం.. పరిశ్రమల స్థాపనకు ఏపీని మించిన రాష్ట్రం లేదని పారిశ్రామిక వేత్తలు భావిస్తుండటం పొరుగున ఉన్న కర్నాటక రాష్ట్రానికి కంటగింపుగా మారింది. దీంతో ఉన్నవీలేనివీ కల్పించి ఏపీపై దుష్ప్రచారానికి తెగబడుతున్నది ఆ రాష్ట్రం. ఈ విషయంలో కర్నాటక మంత్రులే ముందువరుసలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కాదని మరీ ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు ఏపీకి క్యూ కడుతున్నారు. సహజంగానే ఈ పరిస్థితి ఆయా రాష్ట్రాలకు కడుపుమంటగా ఉంటుంది. అయితే కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కడుపుమంట మరీ ఎక్కువగా ఉంది.  ఆ రాష్ట్ర ఐటీ మంత్రి ఏపీలోని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుచిత రాయితీలు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు.  సామాజిక మాధ్యమ వేదికగా కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. గూగుల్ వైజాగ్ నే ఎంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయల రాయతీలు ఇవ్వడమేననీ, అలాగే రాష్ట్ర జీఎస్టీలో వంద శాతం రీయింబర్స్ మెంట్, భూమి ధరపై పాతిక శాతం డిస్కౌంట్, ఉచిత విద్యుత్ ట్రాన్స్ మిషన్, వాటర్ టారిఫ్ పై పాతిక శాతం రాయతీలు ఇచ్చిందనీ..ఈ స్థాయిలో రాయితీలు ఇచ్చిన రాష్ట్రం ఆర్థికంగా దివాళీ తీయడం ఖాయమని ఖర్గే వ్యాఖ్యానించారు. నిస్సందేహంగా ఆయన వ్యాఖ్యలు ఏపీకి గూగుల్ వచ్చిందన్న కడుపుమంటతోనే అన్నది ఎవరికైనా సులువుగా అర్ధమైపోతుంది.  కర్నాటక మంత్రి ఖర్గే వ్యాఖ్యలపై ఏపీ ఐటీ మంత్రి దీటైన బదులిచ్చారు. ఎక్కడా కర్నాటక పేరు కానీ, ఆ రాష్ట్ర మంత్రి  ప్రియాంక ఖర్గే పేరుకానీ ప్రస్తావించకుండానే లోకేష్ ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. ఈ మేరకు లోకేష్ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో  ‘ఏపీలో పచ్చళ్లు మాత్రమే కాదు.. పెట్టుబడులూ స్పైసీయే’ అని పేర్కొన్నారు. ఆ ఘాటును, వేడిని పొరుగురాష్ట్రాల ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసినట్లేనా?

కాంగ్రెస్ లో కొండా కుటుంబ ప్రస్థానం ముగిసిందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్న కొండా సురేఖ కు మరో మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డితో మేడారం జాతర పనుల వ్యవహారంలో తలెత్తిన విభేదాలు చినికిచినికి గాలివానగా మారిన చందంగా ముదిరిపాకాన పడ్డాయి. ఈ విషయంలో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి ఒకింత దూకుడుగా వ్యవహరించడం సమస్యను మరింత పెద్దది చేసింది. ఇక కొండా సురేఖ ఓఎస్డీ తీరు కూడా వివాదాస్పదంగా మారింది. పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఆయన వసూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. తుపాకి గురి పెట్టి మరీ మామూళ్ల కోసం బెదరించేవారన్న ఆరోపణలు, ఫిర్యాదులపై ఆయనపై కేసు నమోదైంది. అయితే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోకుండా కొండా సురేఖ అడ్డుకోవడమే కాకుండా తన నివాసంలో ఆశ్రయం ఇవ్వడం, ఆమె నివాసానికి వచ్చిన పోలీసులతో కొండా సురేఖ కుమార్తె వాగ్వాదానికి దిగడమే కాకుండా, మీడియా ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటిలపై తీవ్ర ఆరోపణలు చేయడం పరిస్థితి చేయిదాటిపోవడానికి కారణమైంది. ఇక ఆమె కేబినట్ పదవికి సీఎం ఉద్వాసన పలకడమో, లేక ఆమే రాజీనామా చేయడమో వినా మరో మార్గం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎంపై అపారమైన విశ్వాసం ఉందంటూ కొండా సురేఖ భర్త కొండా మురళి ఓ ప్రకటనలో పేర్కొని పరిస్థితిని చక్కదిద్దడానికి చేసిన ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సీఎంపైన కొండా దంపతుల కుమార్తె చేసిన విమర్శలు అన్ని హద్దులనూ దాటేశాయని చెబుతున్నారు.  ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి కొండా సురేఖకు పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను కలవాల్సిందిగా మీనాక్షి నటరాజన్ కొండా సురేఖకు ఫోన్ చేసి ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీ తరువాత కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమేంటనేది తెలిసే అవకాశం ఉందని అంటున్నారు.  

లంక‌ల దీప‌క్ రెడ్డి.. ల‌క్కెంత‌.. కిక్కెంత‌?

ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతున్న‌ లంక‌ల దీప‌క్ రెడ్డి 2023 ఎన్నిక‌ల్లోనూ జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక న‌వీన్ సైతం ఇంచుమించు ఇలాంటి ట్రాక్ రికార్డే క‌లిగి  ఉన్నారు. కానీ, ఆయ‌న‌కీ ఈయ‌న‌కీ ఉన్న తేడా ఒక్కటే..  అధికార‌పార్టీ.  దీప‌క్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హించే పార్టీ సైతం కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ ఇక్క‌డ అదేమంత ప‌ని చేసేలా లేదు. గ‌తంలో దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ర‌ఘునంద‌న్ స్థాయి గెలుపు దీపక్ రెడ్డి నుంచి ఆశించ‌డం అయ్యే ప‌ని కాదు. కార‌ణం అప్ప‌ట్లో ఉన్న సిట్యువేష‌న్ వేరు- ఇప్పుడున్న ప‌రిస్థితి వేరు.  ఉన్న స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్టు.. దీప‌క్ రెడ్డి పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్.. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావ‌డం ఒక ఆటంక‌మైతే.. రెండోది ఇక్క‌డ అత్య‌ధికంగా మైనార్టీ ఓట్లుండ‌టం. దీప‌క్ ఇక్క‌డి మైనార్టీల‌ను ఆక‌ర్షించ‌డంలోనూ త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒక ఇంట‌ర్వ్యూలో చెబుతూ మైనార్టీలు ఎంఐఎం పార్టీ అధినేత చెప్పింద‌ల్లా చేసే గొర్రెలు కారంటూ ప‌రుష ప‌ద‌జాలం వాడారు.  ఆమాట‌కొస్తే తాము బీసీల‌కు ఎంతో మేలు చేస్తోన్న పార్టీకి చెందిన వార‌మ‌నీ. ఇంకా మాట్లాడితే త‌మ ప్ర‌ధానే ఒక బీసీ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు దీప‌క్ రెడ్డి. కానీ, ఇక్క‌డ కాంగ్రెస్ ఇచ్చిన‌ట్టు ఒక బీసీ బిడ్డ‌కు టికెట్ ఇచ్చి ఉంటే ఆ మాట‌కు ఒక అర్ధ‌ముండేది. అంతే కాకుండా ఎంద‌రో మ‌హిళ‌లు పోటీ ప‌డ‌గా.. వారంద‌రినీ తోసి రాజ‌ని.. త‌నకున్న కిష‌న్ రెడ్డి స‌పోర్ట్ మొత్తాన్ని వాడారు దీప‌క్ రెడ్డి. దీంతో ఇది కూడా పార్టీకి మైన‌స్ గా మారి దీప‌క్ రెడ్డి విజ‌యావ‌కాశాల‌ను గండి కొట్టేలా కనిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం నుంచి అది కూడా క‌న్నీటిప‌ర్యంత‌మై ప్ర‌చారం చేస్తున్న సునీత ముందు, అధికార పార్టీకి చెందిన  లోక‌ల్ బాయ్ న‌వీన్ ముందు.. దీప‌క్ రెడ్డి జూబ్లీహిల్స్ అనే ఈ లంక‌ను జ‌యించ‌డం అంత సులభసాధ్యం కాదంటున్నారు పరిశీలకులు.  కాకుంటే ఈ ప్రాంతం ఇప్పుడు జ‌న‌ర‌ల్ అయ్యిందిగానీ గ‌తంలో ఇది ఎస్సీ స్థానం. ముస్లిం మైనార్టీలు ఎక్కువున్న ప్రాంతం  కూడా  కావ‌డంతో.. ఇక్క‌డ దీప‌క్ రెడ్డిది పేరుకు పోటీ కానీ.. అస‌లు యుద్ధం మొత్తం సునీత‌, న‌వీన్ మ‌ధ్య ఉండ‌నుంద‌ని అంటున్నారు విశ్లేషకులు.

కాంగ్రెస్‌లో పేలనున్న కొండా దంపతుల టైంబాంబ్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముంగిట నిలిచింది. పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. సుమంత్ అనే వ్యక్తి  ఓఎస్డీ గా చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు.  కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్ల కోసం   స్వయంగా సుమంత్ బెదిరింపులకు దిగుతున్నారు.   డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు. చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు.  సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఆయనకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. పోలీసులు ఆచూకీ తెలుసుకుని అక్కడికి వచ్చినప్పుడు సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా.. తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓఎస్డీని తీసుకుని కొండా సురేఖ వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సుమంత్ ను అదుపులోకి తీసుకోలేకపోయారు. దీంతో ఓఎస్డీ తో అన్ని పనులు చేయించింది కొండా దంపతులేనని అనుమానాలు బలపడుతున్నాయి.  స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తమను అరెస్టు చేస్తారని కొండా సురేఖ, కొండా మురళీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె చెబుతున్నారు. అలాంటి పరిస్థితే వస్తే బయటకు తెలియనిది ఏదో పెద్ద ఘటనే జరిగిందని అనుకోవాలి.

నారా లోకేష్ అచ్చం నాన్నలాగే.. ఈ మాట ఎవరన్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా  నారా లోకేష్ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తుంటే..  పార్టీ సీనియర్ నాయకులు,  మంత్రులు,  ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులూ లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమౌతున్న విధానంతో ప్రజానేతగా ప్రజలు కూడా సంపూర్ణ ఆమోదం పలుకుతున్నారు. ఇటు పార్టీలో, ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో లోకేష్ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు.   అయితే లోకేష్ కు ఈ గుర్తింపు అంత తేలికగా ఏమీ రాలేదు. నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి.   బాడీ షేమింగ్ చేశారు. హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని, ఎదుర్కొని, తనను తాను మలచుకున్న లోకేష్ కు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది.  ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా కర్నూలు విమానాశ్రయం వద్ద ఆయనకు స్వాగతం పలకడానికి తండ్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ తో  కొద్ది సేపు ముచ్చటించారు. ఆ సందర్భంగా లోకేష్ ను మోడీ ప్రశసంలతో ముంచెత్తారు. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో లోకేష్ ను ఆయన పొగిడారు. ఇంతకు ముందు కంటే బరువు తగ్గారంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ.. త్వరలోనే నాన్నలా తయారౌతారంటూ కితాబిచ్చారు. ఏడున్నర పదుల వయస్సులో చంద్రబాబు ఎంత చలాకీగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే  పొలిటికల్ గా, అడ్మినిస్ట్రేటర్ గా నారా లోకేష్ తండ్రికి తగ్గతనయుడిగా కితాబులందుకున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర లోకేష్ ఫిట్ నెస్ ను కూడా తండ్రితో పోల్చి ప్రశంసించడం గమనార్హం.