Read more!

టీ ఉద్యోగులవి తప్పు లెక్కలు: అశోక్‌బాబు

 

చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే రిటైర్మెంట్ వయసును రెండేళ్ళపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల నెత్తిన పాలు పోశారు. ఈ ఒక్క హామీ నెరవేరిస్తే చాలదని, చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నిటీని నెరవేర్చాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తారని అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మిగులు ఉద్యోగులు ఉన్నారని తేటతెల్లమైందన్నారు. ఉద్యోగుల సంఖ్యపై తెలంగాణ నేతలు తప్పు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు.