టీడీపీ ఆరోపణలతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిన జగన్ సర్కార్!!

ఏపీలో భారీ సంఖ్యలో పెన్షన్ లు తొలగించారంటూ విమర్శలు వస్తున్న వేళ దిద్దుబాటు చర్యలకు దిగింది జగన్ సర్కార్. తొలగించిన పెన్షన్ ఖాతాల రి వెరిఫికేషన్ జరపాలంటూ అధికారుల్ని ఆదేశించింది. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ పథకంపై దృష్టి సారించింది, అర్హులైన వారికి పెన్షన్ పథకం నుంచి తొలగించారన్న ప్రతిపక్షాల ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది జగన్ సర్కార్. అనర్హులుగా గుర్తించిన 4.80 లక్షల పెన్షన్ ఖాతాలను పరిశీలించనుంది. 

ఈరోజు నుంచి ఈ నెల 17 వరకు వాలెంటీర్ లు ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ ఖాతాలకు రివెరిఫికేషన్ చేయనున్నారు. దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ ల సంఖ్యను తగ్గించుకోవాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అర్హులైన లబ్ధిదారుల జాబితాలో చోటు దక్కకపోయినా ఈ సారి జరిగే రీ వెరిఫికేషన్ లో న్యాయం జరుగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రంలో అన్యాయంగా చాలా మందికి పింఛన్ లు తొలగించారని టిడిపి ఆరోపించింది.

Teluguone gnews banner