ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ
posted on Apr 11, 2020 @ 6:42PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. సి-19 పేరుతో ఓపీ రూం ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రవేశ మార్గాన్నిఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకే ఉద్దేశించిన ఈ ప్రత్యేక ఓపీ ఉదయం 9నుండి మధ్యాహ్నం 2 వరకే పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఆరోగ్య నిపుణులు, ఇతర పేషంట్లకు కొవిడ్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా పిపిఇలు, ఎన్95 మాస్కులు ధరించిపేషెంట్ల ను పరీక్షించాలని, కొవిడ్ లక్షణాలతో క్యాజువాలిటీలో అడ్మిట్ అయినా వారిని వెంటనే సెపరేట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.