పేదల ఇళ్ళ కోసం 5 వేల కోట్ల రుణం తీసుకోనున్న ఏపీ ప్రభుత్వం...

ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కోసం భూమిని కొనుగోలు చేసేందుకు రుణం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం 5000 కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చేందుకు హడ్కో సంస్థ ముందుకు వచ్చింది. పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలను ఉగాది నాటికి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 27,000 ల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మరో 15,000 ల ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 

25 లక్షల ఇళ్ల పట్టాల కోసం 40,000 ల ఎకరాలు అవసరమవుతుందని రెవిన్యూ శాఖ అంచనా వేసినట్లు సమాచారం. ఇందులో 12,000 ల ఎకరాల భూ యజమానుల నుంచి కొనుగోలు చేసి 3,000 ల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం హడ్కో రుణాన్ని ఉపయోగించనున్నట్లు సమాచారం. జిల్లాల్లో ఊహించిన దానికంటే పెద్ద మొత్తంలోనే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో కొనుగోలు చేయాల్సిన భూ పరిమాణం తగ్గింది. ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 48 గజాల చొప్పున ఉచితంగా ఇళ్ల పట్టాలను అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది

Teluguone gnews banner