దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు!!

ప్రకాశం జిల్లా దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతంలో రక్షణ రంగ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని పరిశ్రమలశాఖామంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు. లక్నోలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్ పోలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి గౌతంరెడ్డి పరిశ్రమల శాఖ అధికారులు హాజరయ్యారు. దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపినట్టు మంత్రి తెలియజేశారు.

దీనికి అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉందని రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇతర ఏరోస్పేస్ పరిశ్రమలు ఇక్కడ తమ యూనిట్ లను ఏర్పాటు చేసుకోవచ్చని డిఫెన్స్ ఎక్స్ పోలో ప్రజెంటేషన్  ఇచ్చారు. ఈ అంశాలను ఫ్రెంచ్ ఇండో రక్షణ పరిశ్రమల సదస్సులో మంత్రి గౌతంరెడ్డి వివిధ దేశాల ప్రతినిధులకు వివరించారు. ఏరోస్పేస్ రక్షణ రంగ పరిశ్రమల స్థాపనకు వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం కీలకమని స్పష్టం చేశారు. దొనకొండకు అతి చేరువలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టు నుంచి ఎగుమతి దిగుమతులకు అవకాశం ఉందని మంత్రి వివరించినట్లు సమాచారం.

Teluguone gnews banner