నిర్భయ కేసు నిందితుల ఉరికి గడువు పెంచిన హైకోర్ట్...
posted on Feb 5, 2020 @ 3:23PM
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుందో అన్న విషయం ప్రశ్నార్ధకంగా మారింది. నలుగురు దోషుల ఉరిపై స్టే విధిస్తూ హై కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హై కోర్టు కూడా సమర్థించింది. నిర్భయ దోషులకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. దోషుల ఉరితీతపై విధించిన స్టే ఎత్తివేయలేమని తెలిపింది. ఈ కేసులో నలుగురు దోషులను వేరువేరుగా ఉరితీయడానికి వీలు లేదని స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ పిటిషన్ ను న్యాయ స్థానం కొట్టేసింది. పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, దినేష్ శర్మల కు పిటిషన్ దాఖలు చేసుకోవడాని కి వారం రోజుల గడువిచ్చింది కోర్ట్. నిర్భయ కేసులో అధికారుల అలసత్వంతోనే రివ్యూ పిటిషన్ల పై విచారణ ఆలస్యం అవుతుందని హై కోర్టు స్పష్టం చేసింది. నలుగురు దోషులు క్రూరమైన నేరానికి పాల్పడ్డారని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
నలుగురు దోషుల మరణశిక్షపై పటియాలా కోర్టు విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం వేసి న పిటిషన్ పై విచారణ జరిపింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా సుదీర్ఘంగా వాడి వేడి వాదనలు సాగాయి. ముందుగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులు న్యాయవ్యవస్థని అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మొదట జనవరి 22న నలుగురు దోషులు ఊరికి డెత్ వారెంట్ జారీ చేసిన ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో శిక్ష అమలు వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ఉరితీయాల్సినప్పటికి న్యాయపరమైన అంశాలు ఉన్నాయని అవకాశాలున్నాయని స్టే విధించింది ఢిల్లీ కోర్టు. నలుగురు దోషులు ముఖేష్ వినయ్ క్షమాభిక్ష పిటిషన్ ను ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. మరణశిక్షను వాయిదా వేయించుకునేందుకు తమకున్న అన్ని అస్త్రాలనూ ఉపయోగిస్తున్నారు దోషులు. రకరకాల పిటిషన్ లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. హై కోర్టు తాజా తీర్పు తో నలుగురు దోషుల కు ఎప్పుడు ఉరిశిక్ష అమలవుతుందో అర్థం కావట్లేదు. 7 ఏళ్ళ నుంచి తమకు అన్యాయం జరుగుతోందని నిర్భయ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోషులకు ఇన్ని అవాకాశాలను ఎందుకు కల్పిస్తుందో అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. శిక్ష నుంచి కాపాడే ప్రయనం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం.