రాజధాని మార్పు మా చేతుల్లో లేదు... ప్రజలను మభ్య పెట్టొద్దు!! 

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 23 ఏప్రిల్ 2015 న ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో కాపీ కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం మార్పు చేయలేదని ఇది రాష్ట్ర ప్రభుత్వం తనంత తానుగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు.  రాష్ట్రంలో రాజధాని మార్పు గురించి కానీ ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులు అన్న విషయం పై కేంద్రానికి అధికారిక సమాచారం ఏమి లేదని మీడియా ద్వారానే విషయాలను తెలుసుకోగలిగామని జీవీఎల్ వెల్లడించారు. రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధానిని పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని  ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టుకోవాలి అన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారం అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పిందని ఆయన వెల్లడించారు. 

కొత్త రాజధాని విషయం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి తాను ఇదే విషయాన్ని అనేక  ప్రెస్ మీట్ లలో ప్రస్తావించినట్లు ఆయన అధికారికంగా ప్రస్తావించినట్లు తెలియజేశారు. అయితే అమరావతే రాజధానిగా కొనసాగాలని తాము భారతీయ జనతా పార్టీ ద్వారా అధికారికంగా స్పష్టం చేసినట్లు జీవీఎల్ తెలియజేశారు. అమరావతిలో అక్రమ భూముల దందా కొనసాగిందన్న విషయాన్ని తమ ఎన్నికల మానిఫెస్టోలో కూడా  ఒప్పుకున్నామని  కేవలం ఈ ఒక్క అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాజధాని మార్పు చేయడం సరికానిదని జీవిఎల్ తెలియజేశారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని దుర్వి నియోగం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేసి రాజధానిని మార్చడం అనేది దుర్మార్గం అవుతుంది తప్పితే అది రాజకీయం కాదని  జీవీఎల్ వెల్లడించారు. రాజధాని మార్పు కేంద్రం చేతిలో ఉందని ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెప్పొద్దని అన్నారు. రాజధాని మార్పు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మేము రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేము కానీ.. ఒక రాజకీయ పార్టీగా మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామని జీవీఎల్ అన్నారు.

Teluguone gnews banner