గవర్నర్ తో చంద్రబాబు భేటీ, పుష్కరాలకు ఆహ్వానం
posted on Jul 13, 2015 7:47AM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జపాన్ పర్యటన ముగించుకొని డిల్లీ వెళ్లి వచ్చిన తరువాత నిన్న గవర్నర్ ని కలిసి తన పర్యటన వివరాలను తెలియజేసారు. తరువాత ఆయనని గోదావరి పుష్కారాలకు ఆహ్వానించారు. వారిరువురూ గంటకు పైగా సమావేశమయ్యారు. చంద్రబాబు నాయుడు ఈరోజు రాజమండ్రి చేరుకొని పుష్కరపనులు మరొకసారి సమీక్షించి రాత్రి రాజమండ్రిలోనే బస చేస్తారు. రేపు ఉదయం 6.23నిమిషాలకు కుటుంబ సమేతంగా గోదావరిలో నదిలో పుష్కర స్నానం ఆచరిస్తారు.