Read more!

ఆమెకి కోపం వచ్చింది.. మొగుణ్ణి ‘ఎక్కడో’ కొరికింది

 

 

 

భోపాల్‌లో ఒక ఇల్లాలికి భర్తమీద కోపం వచ్చింది. భర్తకి కూడా ఆమె మీద కోపం వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తని కొరికేసింది. ఎక్కడ కొరికిందని మాత్రం అడక్కండి.. ‘ఎక్కడో’ కొరికేసింది. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే, భోపాల్‌లో కాపురం వుండే జితేంద్ర, ఉమా పాటిల్ అనే జంటకి నాలుగేళ్ళ క్రితం పెళ్ళయింది. వీళ్ళిద్దరూ చిలకాగోరింకల్లా కాపురం చేసుకునేవారు.

 

 

ఇప్పటికి కరెక్ట్‌గా నెల రోజుల క్రితం ఇద్దరి మధ్య వంటకి సంబంధించిన పాయింట్ మీద చిన్న గొడవొచ్చింది. ఆ చిన్న గొడవ కాస్తా బాగా ముదిరి ఇద్దరూ చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా తిట్టుకోవడం వరకు డెవలప్ అయి, చివరకి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ గొడవలో ఉమా పాటిల్‌కి బీపీ బాగా పెరిగిపోయింది. దాంతో భర్తని ‘ఎక్కడో’ కొరికేసింది. దాంతో ఆ భర్తగారు లబోదిబో అనుకుంటూ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య తన విషయంలో చేసిన సదరు ‘ఘనకార్యం’ గురించి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు మొగుడూ పెళ్ళాన్ని కూర్చోబెట్టి, కౌన్సిలింగ్ చేశారు. ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఆ తర్వాత కుక్కకాటు ఎంత డేంజరో, మనిషి కాటు కూడా అంతే డేంజర్ కాబట్టి డాక్టర్ దగ్గరకి వెళ్ళి ట్రీట్‌మెంట్ చేయిచుకోమని సదరు భర్త జితేంద్రకి సూచించారు. అయితే జితేంద్ర ఆ సూచనని పెద్దగా పట్టించుకోలేదు.

అయితే భార్యగారి ‘కాటు’ ప్రభావం నెలరోజుల తర్వాత బయటపడింది. ఉమా పాటిల్ కొరికిన సదరు స్థానం బాగా వాచిపోయింది. అప్పటికి జ్ఞానోదయమైన జితేంద్ర నెత్తీ నోరూ బాదుకుంటూ మంగళవారం నాడు పోలీస్ స్టేషన్‌కి, అటు నుంచి అటే ఆస్పత్రికి చేరుకున్నాడు. భార్య కాటు విషపూరితమవ్వడం వల్ల బాగా వాచిపోయిందని డాక్టర్లు తేల్చారు. ఈ వాపు తగ్గాలంటే భారీ స్థాయిలో ట్రీట్‌మెంట్ చేయాలని తేల్చారు. దాంతో జితేంద్ర బేర్‌మని ట్రీట్‌మెంట్ చేయించుకుంటున్నారు. పోలీసులు మాత్రం భర్తని కొరికిన భార్య మీద ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేశారు.