ఆమెకు ౩౦.. అతనికి 19 .. ఏంటో తెలుసుకోండి..
posted on May 7, 2021 @ 1:06PM
ఈ మధ్య కాలం లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి. పెళ్లిళ్లు జరిగిన, పిల్లలు ఉన్న అటు ఆడ, ఇటు మగ ఇద్దరు రెచ్చిపోతున్నారు. పెళ్లి అనే పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేస్తున్నారు. భార్య మరొకడితో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుందని భార్య ఒకరినొకరు క్షణికావేశంలో చంపుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో పసిపిల్లనకు అనాధలుగా చేస్తున్నారు.
అది తూర్పు గోదావరి జిల్లా. కాజులూరు మండలం. శీల పంచాయతీ. ఆమె పేరు రమణమ్మ. ఆమెకు 30 సంవత్సరాలు, ఆమెకు పెళ్లి అయింది. ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. మొగుడు, పిల్లలు చూసుకుంటూ ఉండాల్సిన ఆమె అక్కడితో ఆగలేదు.
అతనికి పేరు జె.వెంకటశివరామరాజు. అతనికి 19 ఏళ్లు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి రమణమ్మతో పరిచయం అయింది. ఆ పరిచయాన్ని పెంచుకున్నాడు. తర్వాత, ప్రేమిస్తున్నానని చెప్పడంతో.. గత రెండేళ్లుగా శీలలంకలోని ఓ రొయ్యల చెరువుల వద్ద పనికి కుదిరి ఇద్దరూ అక్కడే సహజీవనం సాగిస్తున్నారు. రమణమ్మ మూడేళ్ల చిన్న కుమార్తె కూడా వారితోనే ఉంటోంది.
కట్ చేస్తే.. ఆ రమణమ్మ 19 ఏళ్ళ ఆటో డ్రైవర్ కి పెళ్ళాం అవుదామనుకుంది. తనని పెళ్లి చేసుకోమని లవర్ ని అడిగింది. అతని నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అంతటితో ఆమె ఊరుకోలేదు అతడిని నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని రమణమ్మ వెంకటశివరామరాజు పై రోజు ఒత్తిడి తీసుకొస్తుండటంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మూడు రోజుల క్రితం కూడా గొడవ పడి రాత్రికిరాత్రే ముగ్గురూ మాయమైనట్లు రొయ్యల చెరువుల యజమాని ఎం.వేణుగోపాల్ శుక్రవారం గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, విచారణ చేపట్టిన పోలీసులు శనివారం అర్ధరాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రమణమ్మను ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చి, తాను పని చేస్తున్న చెరువుల వద్దే పూడ్చిపెట్టడడంతో పాటు ఆమె కూతురును పిఠాపురంలో రోడ్డు పక్కన వదిలి పరారైనట్లు నిర్ధారించారు. కాకినాడ రూరల్ సీఐ ఆకుల మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం నిందితుడిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి.. తహసీల్దారు బి.సాయిసత్యనారాయణ, వైద్యుల సమక్షంలో రమణమ్మ మృతదేహన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సంరక్షణలో ఉందని ఆయన చెప్పారు.