ఐసీసీ ట్వంటీ-20, వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా గెలుపు

ఆస్ట్రేలియా రెండో వరుస విజయంతో టి-20 ప్రపంచ కప్ సూపర్-8 దశకు దూసుకెళ్లింది. గ్రూప్-బిలో భాగంగా వెస్టిండీస్‌తో శనివారం జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో ఆసీస్ 17 పరుగులతో విజయం సాధించింది. వాట్సన్ 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 నాటౌట్తో ఆల్‌రౌండ్ షోతో వీరంగం సృష్టించాడు. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలు వర్షం వచ్చేసరికి 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగుల చేశారు. వర్షం తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి కంగారూలకు 83 పరుగులు కావాల్సివుండగా, 17 పరుగులు ఆధిక్యంలో ఉన్నారు.


వాట్సన్‌తో పాటు మైక్ హస్సీ 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 నాటౌట్, వార్నర్ 14 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 దూకుడుగా ఆడారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 191 పరుగులు సాధించింది. క్రిస్ గేల్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54, శామ్యూల్స్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 మెరుపులు మెరిపించగా, డ్వెన్ బ్రావో 21 బంతుల్లో 27తో  ఆకట్టుకున్నారు. స్టార్క్ మూడు, వాట్సన్ రెండు వికెట్లు తీశాడు. వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.