జగన్ బాణం ఎవరిమీద : సత్తిబాబు మండిపాటు

 

తాను జగనన్న వదిలిన బాణాన్నంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై పిసిసి ఛీప్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ చేసేసి ఇప్పుడు వాటన్నింటినీ కాంగ్రెస్ నెత్తిన పడేసి తాము మంచివాళ్లుగా నిరూపించుకునే ప్రయత్నం జగన్ వర్గం చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని వదిలిన బాణాలన్నీ నిష్ఫలమైపోయాయన్న సత్యాన్ని చరిత్రను చూసి తెలుసుకోవాలని బొత్స అన్నారు. అవకాశం కోసం పూటకోమాట మాట్లాడుతూ రాజకీయాన్ని భ్రష్టుపట్టించొద్దంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్చం చేశారు. రైతన్నలకోసం తాను ఓ పూట తిండిమానుకున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి వైద్యులు సలహా ఇవ్వడంవల్లే ఓ పూట రాత్రి భోజనం మానేశారు తప్ప, చంద్రబాబుకి చేనేతల సమస్యలమీద అక్కర లేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.