శాన్వి ఆచూకి తెలిపితే 50 వేల డాలర్లు
posted on Oct 26, 2012 @ 5:17PM
కింగ్ ఆఫ్ పర్షియాలో గత సోమవారం దుండగుల చేతిలో హత్యకు గురైన ప్రకాశం జిల్లా కుడుముల కుంట్ల వాసి సత్యవతమ్మ (61)కు తానా, టీఏజీడీవీ నివాళి అర్పించాయి. ఆ రోజు జరిగిన దుర్ఘటనలో సత్యవతమ్మ ప్రాణాలు వదలగా ఆమె మనవరాలు శివప్రసాద్ రెడ్డి, లతల పదినెలల కుమార్తె శాన్వి వెన్నను దుండగులు అపహరించారు. సత్యవతమ్మ ఆరు నెలల క్రితమే కింగ్ ఆఫ్ పర్షియాలోని కొడుకు శివప్రసాద్ ఇంటికి వచ్చింది. మానవీయ దృక్పథంతో తన కూతురిని అప్పగించాలని శివప్రసాద్ రెడ్డి కోరుతున్నారు. ఎఫ్ బీఐ, స్థానిక పోలీసులు సాన్వి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన తెలుగువారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో వెన్న కుటుంబానికి భరోసానిచ్చేందుకు తానా.. కింగ్ ఆఫ్ పర్షియాలోని అప్పర్ మెరియన్ టౌన్ షిప్ బిల్డింగ్ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 50 వేల వేల డాలర్లు బహుమతి ఇస్తామని ప్రకటించారు.