వాద్రాపై విచారణ జరిపిన అధికారిపై బదీలి వేటు

 

రాబర్ట్‌ వాద్రా, డీఎల్ఎఫ్ మధ్య హర్యానాలో కుదిరిన ఒప్పందంపై విచారణకు ఆదేశించిన ఐఏఎస్ అధికారి అశోక్‌ ఖేమ్కాపై వేటు పడింది. హుడా ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. రాబర్ట్‌ వాద్రా, డీఎల్ఎఫ్ ఒప్పందంపై రిజిస్ట్రేషన్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ అయిన ఖేమ్కా విచారణకు ఆదేశించారు. గుర్గావ్‌, ఫరీదాబాద్‌, పల్వాల్‌, మెవాత్‌ జిల్లాల్లో 2005 నుంచి అక్టోబర్‌ 12 వరకూ రాబర్ట్‌ వాద్రా పేరుపైన వచ్చిన పత్రాలన్నింటినీ పరిశీలించాలని అధికారులను కోరారు. అదే సమయంలో వాద్రాకు చెందిన స్కైలైట్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డీఎల్ఎఫ్కు మధ్య కుదిరిన ఒప్పందంలో అవకతవకలున్నాయనే నేపధ్యంలో డీల్‌ను రద్దు చేశారు. అవకతవకలపై విచారణకు ఆదేశించడమే ఆయన చేసిన తప్పన్నట్లుగా ఖేమ్కాను ట్రాన్స్‌ఫర్‌ చేయడంపై బిజెపి సహా ప్రతిపక్షాలు హుడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అవకతవకల నిగ్గు తేల్చడానికే ఆదేశించానని ఖేమ్కా తెలిపారు. మిగతా విషయాలను కోర్టులు తేల్చాలని అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.