మక్కాలో చెలరేగిన మంటలు
posted on Oct 23, 2012 @ 10:17AM
మక్కాలోని ఓ తొమ్మిదంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయ్. మక్కా యాత్రకోసం వెళ్లి ఆ భవంతిలో బసచేసిన యాత్రికులకు తీవ్రగాయాలయ్యాయ్. నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు క్షణాల్లో భవంతిని ఆక్రమించుకున్నాయ్. హుటాహుటిన పరిగెత్తుకొచ్చిన రెస్క్యూటీమ్ యాత్రికుల్ని ప్రమాదంనుంచి కాపాడింది.. దాదాపు పదిహేనుమందికి తీవ్రగాయాలైనట్టు సౌదీ వార్త సంస్థ ప్రకటించింది. గాయాలబారినపడి ఆసుపత్రి పాలైనవారిలో భారతీయ యాత్రికులుకూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ అధికారికి సమాచారమేమీ లేదు. సౌదీ అధికారులు కూడా గాయపడ్డవాళ్లంతా మారిషస్ కి చెందిన యాత్రీకులని చెబుతున్నారు. ఘటనపై అక్కడి ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.