నంది అవార్డుల్లో దూసుకెళ్తున్న మహేష్ బాబు

 

నంది అవార్డుల ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమలో సంబరాలకు తెరలేపింది. అన్ని పోటీలను తట్టుకుని నందిని గెలుచుకున్న నటులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక హీరో మహేష్ బాబు, నటుడు ప్రకాష్ రాజ్ లు మరీ మరీ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రకాష్ రాజ్ అందుకుంటున్నది 9వ నంది అవార్డు అయితే, హీరో మహేష్ బాబు అందుకుంటున్నది ఏడవ నంది అవార్డు కావడం విశేషం. ఇంతకు ముందు నిజం, అతడు పాత్రలకు ఉత్తమ నటుడి అవార్డులతో పాటు, పలు చిత్రాలకు స్పెషల్ జ్యూరి అవార్డులు గెలుచుకున్నాడు. అసలు ఉత్తమ నటుడి అవార్డుకు హీరోలు నాగార్జున, బాలకృష్ణలతో పోటీ పడి ప్రిన్స్ అవార్డు కొట్టేశాడు. రాజన్న సినిమాలో నాగార్జున, శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ ల పాత్రల నిడివి తక్కువగా ఉండడం, ఆ చిత్రంలోని మిగతా పాత్రల పరిధి ఎక్కువగా ఉండడం మహేష్ బాబు కు ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో ఆయనను ఉత్తమ నటుడిగా అవార్డు కమిటీ ఏకగ్రీవంగా ఎంపికచేసింది.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.