Read more!

వేడికోలు

 



వేడికోలు

 

అంతానీవే అంటారు  మరి ఎవరికీ  కను పించవేం?
నిన్ను చూడాలంటే ఏం చేయాలి?
కాస్త చెప్పవయ్యా  దేవుడా? పూజాలు చేయాలా ? ఉపాసముం
డాలా ? నిన్నెప్పుడూ తలచుకుం టుంటే   చాలదా ప్రభూ!

పూజలు  చేసి చేసి  విసిగి పోయాను ; నిత్యమూ
పాటలు పాడీ పాడీ అలసి పోయాను; ఇంక  యే
యే మాత్రమూ నిల్చునే  ఓపికలేదు ;కళ్ళు బైర్లు క
 మ్మి తూలి పడబోతున్నా! విధి ఎట్లున్నదో కదా !

సొమ్మసిల్లిన నాలో నీ స్మరణ నిరంతరం
సాగుతున్నట్టుగానే  వుంది; దేహస్మృతి లేదు ; కా
ని, నా స్మృతిలో  నీవున్నావు ;నీవుదక్క వేరు యే
మున్నది?     నేను నీ దేహాన్ని కాదన్న స్మృతికల్గింది .
శరీర స్మృతి ఉన్నంత వరకే బంధనాలు, ఈ
సుఖదుఃఖాలు ,ఆ భ్రాంతి తొలగిం దంటే  చూసుకో
అంతా అనందమే  ! అంతా సుఖ చైతన్యమే ! ఇక
కావలసిన  దేదీ  కోరదగిన  దేదీ   వుండదు  !

దివ్యానంద  సుఖంలో  మునిగినవానికింక  కా
వలసినది  ఏముంటుంది ? నిరంతర అమృత
పానం చేయటమే ! ఔను ! జీవి ముక్తిని పొందటం
అతీతమైన   ఆత్మానుభవాన్ని  పొందుటే మరి !

శ్రీ  హరి చరణాలే నమ్మినవానికి  ఇక         
భయమెందుకట?  అన్నీ వదలిన వారినీ ఇక
నీవే  దిక్కను  వార్ని తాను రక్షిస్తాననే  శప
థం చేశాడు కదా స్వామి; ఈ జన్మకిది చాలదా ?
మర్యాదలేని  వాన్నే;క్షుద్రున్నే ,అసూయనిండిన
వాణ్ణి, చపల చిత్తున్ని  దురహంకారినే ! కృత
ఘ్నున్ని,పరుల వంచించు వాణ్ణి, పాపిష్టి వాడిని
క్రూరుడనైన నే యీ దుఃఖ సాగరాన వుంటినే !
 

నన్ను కనగ రావా ? నన్నుద్ధరింపగ రావ? నీ
వుదక్క  ఎవ్వరే  దిక్కు ?అని బాధను చెప్పు కొం
టనే తన ప్రమేయం లేదంటేనే తన అస్తిత్వం
లేదంటేనే కదా ! తాను  మొరవినేది శ్రీ హరి !

పిలిస్తే పలికేవాడు ,కొలిస్తే మురిసేటి వా డు,
ఆర్తి తొలగించే వాడు ను ,కొండంత అండగా
నుండే వాడును , భక్త్యాలికి సులభుడు ఐన  ఆ
దేవదేవుడు  వాగ్దానాన్ని  నెరవేర్చు కొంటాడు!
 

ప్రభూ  !  నాలోని నైచ్యాన్ని , నాలోని చపలత్వము,
నాలో నిండిన  దుర్గుణాల  సమూహాన్ని  నీ అరు
ణ కరుణ కటాక్ష వీక్షణాల  నుగ్గు చేసి , 
నన్ను స్వీకరిం౧శ్రే చగా  నీ పాదాల శరణ మంటిని.

     
అస్తు ! తథాస్తు ! శ్రీ రస్తు !


రచన :- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్
ఇది సంస్కృత శ్లోకమైన  అనుష్టుప్ ఛంధ మాధారముగా  వ్రాయ బడినది.