Read more!

మార్గశిర మాసంలో చేయాల్సిన పుణ్యకార్యాలు ఇవే!

 

మార్గశిర మాసంలో చేయాల్సిన పుణ్యకార్యాలు ఇవే!

>> మార్గశిర  మాసంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయాలి.  ఈ మాసంలో శ్రీ కృష్ణుడిని పూజించడం అనేది చాలా ఫలవంతం అవుతుంది. ముఖ్యంగా శ్రీ కృష్ణ పరమాత్ముడికి  ఎంతో ఇష్టమైనటువంటి ఈ మాసంలో, చిన్ని కృష్ణుడి భజనలు కీర్తనలు వాడటం వల్ల ఆయన కృపా కటాక్ష వీక్షణాలకు నోచుకోవచ్చు. 

>>  మార్గశిర  మాసంలో ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణునికి ఇష్టమైన భగవద్గీతను  పఠించాలి. ఈ మాసంలో గీతా పఠనం ద్వారా సర్వపాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. 

>>  మార్గశిర  మాసంలో శంఖాన్ని తప్పనిసరిగా పూజించాలి. దీంతో పాటు శంఖంలో గంగాజలం పోసి ఇంటింటా చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. దీంతో మీ ఇంట్లో  సంతోషం వెల్లి విరిస్తుంది. 

>>  మార్గశిర  మాసంలో  “ఓం శ్రీ కృష్ణాయ నమః “ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు జపించాలి.ఇలా చేయడం ద్వారా మీ మనసులో కోరుకున్న కోరిక నెరవేరుతుంది.

>>   ఈ మాసంలో మీరు తప్పనిసరిగా 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని కూడా జపించడం ద్వారా భగవంతుడి ఆరాధన చేయవచ్చు. మార్గశిర  మాసంలో తగాదాలకు కూడా దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. 

>> మార్గశిరమాసంలో  ప్రతి గురువారం  లక్ష్మీదేవి పూజ చేయడం ద్వారా దరిద్రం తొలగిపోయి.. లక్ష్మీ కటాక్షం లభించి ధనవంతులు అవుతారని స్వయంగా నారదుడు, పరాశరుడు తెలిపారు. 

>> ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ప్రతి రోజు ఆవునేతితో దీపం వెలిగించి, ఆ వెలుతురులో విష్ణు సహస్ర నామం, భగవద్గీత పారాయణం చేయడం ద్వారా విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతోంది.