తుఫాను బాధితులకు పవన్, చరణ్ ఆర్థిక సాయం
on Oct 14, 2014
హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలుగు సినిమా తారలు తమ వంతు సహాయాన్ని అందించటానికి ముందుకు వస్తున్నారు. సినీ నటులు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. రామ్ చరణ్ 10 లక్షల ప్రకటించగా, పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. తుఫాను బాధితులను రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా కృషి చేసి ఆదుకోవాలని పవన్ అన్నారు. తుఫాను సహాయ కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఫ్యాన్స్ కి ఆయన పిలుపునిచ్చారు. తుఫాను సహాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ౦ ప్రశంసనీయంగా పనిచేస్తు౦దని రామ్చరణ్ ప్రశంసించారు.