ఇల్లు కాలుతుంటే.. చుట్టకు నిప్పా?

 

 

 

ఒకవైపు ఇల్లు కాలిపోతుంటే మరోవైపు చుట్టకు నిప్పు దొరికిందని సంబర పడ్డాడట వెనకటికెవడో. మన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల) తీరు అలాగే ఉందని గవర్నర్ నరసింహన్ మండిపడ్డారు. వాళ్ల విదేశీ పర్యటనల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పథకాలు, కార్యక్రమాల అధ్యయనం పేరుతో విదేశీ పర్యటనలకు అనుమతించాలని ఫైళ్లు రావటంతో ఆయన మండిపడ్డారు. ఒకపక్క విభజన ప్రక్రియ, మరోపక్క ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు ఎవ్వరికీ విదేశీ పర్యటనలకు అనుమతితో పాటు సెలవులు కూడా మంజూరు చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. ఇక నుంచి విభజన ప్రక్రియ ముగిసే వరకూ ప్రభుత్వఉద్యోగులు ఎవ్వరికీ గవర్నర్ అనుమతి లేకుండా సెలవులూ మంజూరు చేయరు. దీనికి సంబంధించి సీఎస్ మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనున్నారు.