బీజేపీలోకి దినేష్ రెడ్డి?
posted on Mar 21, 2014 12:27PM
ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. బీజేపీ వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆయన కమలం పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర బీజేపీ నేతలతో దినేష్రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల్లో బీజేపీ తరుపున ఒంగోలు లోక్సభ స్ధానం నుంచి బరిలోకి దిగేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇంకా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. తనకు మద్దతివ్వాలంటూ ముందే టీడీపీ నేతలను కలిసి వచ్చి, ఆ తర్వాతే ఆయన బీజేపీ నాయకులను సంప్రదించారని దినేష్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే పార్టీలో చేరికపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో కూడా దినేష్రెడ్డి ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.