TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణాలో ఉనికిని చాటుకొనేందుకు వైకాపా తిప్పలు

Published on: Mon May 11, 2015 10:18AM

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా యాత్రలు చేస్తూ రైతన్నలను ఆకట్టుకొని తన పార్టీని బలపరుచుకోవాలని ప్రయత్నిస్తుంటే, తెలంగాణాలో ఆ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో ‘రైతు దీక్ష’ అంటూ నిన్న ఒక్కరోజు నిరాహార దీక్ష చేసారు. అయితే ఉదయం సుమారు 9-10 గంటలకు ఆయన నిరాహార దీక్ష మొదలుపెట్టి సాయంత్రం 4గంటలకే ఇద్దరు రైతుల చేతుల మీదుగా నిమ్మరసం పుచ్చుకొని దీక్ష విరమించారు. ఆ మాత్రం దానికి అంత హడావుడి ఎందుకు అంటే తెలంగాణాలో తమ పార్టీ ఉనికిని చాటుకోవడానికేనని వేరే చెప్పనవసరం లేదు. వైకాపాకు రైతుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉన్నట్లయితే అవి సాధించేవరకు ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తెచ్చినట్లయితే, ప్రభుత్వం కూడా రైతుల సమస్యల పరిష్కారం కోసం మరింత శ్రద్ధ పెట్టేది. కానీ ఈవిధంగా మొక్కుబడి దీక్షలు చేయడం వలన ముందు వైకాపాయే ప్రజలలో నవ్వులపాలవుతుంది.