టీడీపీలోకి మరో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి..

 

వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీడీపీలోకి జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్న తరుణంలో మరో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో మోహన్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఆయన కార్యకర్తలు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 

 

కాగా ఎస్వీ మోహన్ రెడ్డి భూమా నాగిరెడ్డి స్వయాన బావ. ఈ నేపథ్యంలోనే భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ టీడీపీలో చేరినప్పుడే ఈయన కూడా టీడీపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆఖరికి ఇప్పుడు చేరిక ఖరారైంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu