కోహ్లీకి గాయం.. సెకండ్ టీ20కి దూరం..?

కెప్టెన్‌గా.. క్రికెటర్‌గా భీకర ఫాంలో ఉన్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ‌కి గాయమైంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య నిన్న జరిగిన తొలి టీ20లో కోహ్లీ గాయపడ్డాడు.. బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డ కోహ్లీ కాలి నోప్పితోనే బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే ఫీల్డింగ్ సమయంలోనూ కాలి నొప్పి మరీ ఎక్కువ కావడంతో డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. దీంతో రెండో టీ20లో విరాట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. కోహ్లీ దూరమైతే రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.