వరద బాధితులకు హెల్ప్ లైన్ నంబర్లివే!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వరదలు జలప్రళయం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలకు సంబంధించి ఆపదలో చిక్కుకున్న వారి కోసం విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్నవారు కమాండ్ కంట్రోల్ నంబర్ 81819 60909కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలి. వారికి వెంటనే సహాయం అందుతుంది. వీఎంసీ ల్యాండ్ లైన్ నంబర్లు 0866-2424172, 0866-2427485, కలెక్టరేట్ కంట్రోల్ రూమ్- 0866-2575833, టోల్ ఫ్రీ కలెక్టరేట్ 1800 4256029 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu