వేణుమాధవ్ నామినేషన్ ఎందుకు వేయలేదో?..
posted on Nov 16, 2018 4:00PM

వేణుమాధవ్..తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన కమెడియన్.గత కొంతకాలంగా ఆయనకి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నారు.వేణు మాధవ్ కి టీడీపీ పార్టీ అంటే ఎనలేని అభిమానం.ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు పార్టీ సభల్లో తన మిమిక్రితో ప్రచారం చేశారు.అప్పట్లో సినిమా అవకాశాలు వస్తుండటంతో రాజకీయాలకి దూరం అయ్యారు.అయితే గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ తరుపున పోటీ చేద్దామనుకున్నా చంద్రబాబు సూచన మేరకు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు.అయితే తెలంగాణలో తాజాగా ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో ఈసారి అయినా పోటీ చేద్దాం అనుకుంటే పొత్తులో భాగంగా తన సొంత నియోజకవర్గమైన కోదాడ కాంగ్రెస్ పార్టీ వశమైంది.దీంతో స్వత్రంత్ర అభ్యర్థిగా బరిలో దిగటానికి సిద్దమయ్యారు.తాజాగా నామినేషన్ వేసేందుకు కోదాడ తహసీల్దార్ కార్యాలయినికి వెళ్లారు.అయితే వేణుమాధవ్ కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.నామినేషన్ పాత్రలు సరిగాలేకపోవటంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు.దీంతో ఆయన వెనుదిరిగారు. పూర్తిస్థాయిలో పత్రాలను సేకరించుకున్న తర్వాత మళ్లీ తాను నామినేషన్ దాఖలు చేస్తానని వేణుమాధవ్ తెలిపారు.
