ఉదయ్ సభలో విషిత కన్నీరు
posted on Jan 17, 2014 8:53AM

నటుడు ఉదయ్ కిరణ్ ఇటీవలే ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఉదయ్ సంస్మరణ సభ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ సభకు ఉదయ్ భార్య విషిత, అక్కాబావలు శ్రీదేవి, ప్రసన్న, తండ్రి మూర్తి, ఉదయ్ మేనేజర్ మున్నాలు హాజరయ్యారు. ఈ సభలో విషిత మాట్లాడుతూ... ఉదయ్ నా ఊపిరి. ఆయన లేడనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. అంటూ విషిత ఒక్కసారిగా కన్నీటి పర్యంతమవ్వడంతో అక్కడున్నవారి హృదయాలను మరింత కలచివేసింది. రేపు ఎలా గడుస్తుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. బాధలో ఉన్న తనకు తన వదిన శ్రీదేవి ఎంతో మోరల్ సపోర్ట్ అందించారని, కానీ రేపు ఆమె కూడా వెళ్ళిపోతున్నారని విశిత బాధపడింది. ఉదయ్ అంతిమ యాత్రలో పాల్గొన్న అభిమానులకు ఈ సందర్భంగా ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.