సుచిత్ర సేన్ కన్నుమూత

 

ప్రముఖ బెంగాలి నటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సుచిత్రాసేన్ (82) (మూన్ మూన్ సేన్ తల్లి) ఈరోజు ఉదయం కోల్‌కతాలోని బెల్లే వ్యూ ఆసుపత్రిలో మరణించారు. ఆమె గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈనెల 3నుండి ఆమె పరిస్థితి మరింత విషమించడంతో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ లోకి మార్చి వైద్యం అందిస్తున్నారు. కానీ ఆమెకోలుకోలేకపోయారు. ఆమె కుమార్తె మరియు మనుమరాళ్ళు అందరూ పక్కన ఉండగానే ఆమె కనుమూసారు. (పాత)దేవదాసు సినిమాలో ఆమె నటనకు ఉత్తమనటి అవార్డు అందుకొన్నారు. బెంగాలీ సినిమాలలో ఆమెకు ఒక ప్రత్యెక స్థానం, గౌరవం ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను అత్యంత ప్రతిష్టాత్మకమయిన ‘వంగ విభేషణ్’ బిరుదుతో సత్కరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu