రేవంత్‌కు ప్రాణహానీ ఉంది..భద్రత పెంచండి-చంద్రబాబు

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డికి ప్రాణహానీ ఉందని, ఆయనకు భద్రత పెంచాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నిన్న ఢిల్లీలో రాజ్‌నాథ్‌ను కలిసిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై రేవంత్ పోరాటం చేస్తున్నందున ప్రాణహానీ ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. అదనపు భద్రతపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. రేవంత్‌కు భద్రత పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu