20 కోట్లు పలికిన 'టిప్పు' ఖడ్గం

 

లండన్ లో జరిగిన వేలంలో మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం భారీ ధరకి అమ్ముడుపోయింది. ఈ ఖడ్గం పిడి పులి తల బొమ్మతో ఉండి వజ్రాలు, రత్నాలతో పొదిగి ఉంటుంది. ఓ వ్యక్తి ఈ ఖడ్గాన్ని ఏకంగా రూ. 20 కోట్లు పెట్టి దక్కించుకున్నాడు. వేలంలో టిప్పు సుల్తాన్ ఖడ్గంతో పాటు ఆయన ఉపయోగించిన 30 రకాల ఆయుధాలను విక్రయించింది 'బోన్ హామ్స్'. టిప్పు సుల్తాన్ కత్తికి రూ. 20 కోట్లు రాగా మిగిలిన ఆయుధాలను మొత్తం రూ. 37 కోట్లకు విక్రయించారు. అయితే టిప్పు సుల్తాన్ వాడిన ఖడ్గం రూ 10 కోట్లు రావచ్చని అంచనా వేసామని కానీ ఆ అంచనాలను దాటి రెట్టింపు ఆదాయం వచ్చిందని బోన్ హామ్స్ అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu