ఒమన్‌లో భారతీయ కుటుంబం మృతి

 

గల్ఫ్‌లోని ఒమన్‌లో ముగ్గురు సభ్యులన్న భారతీయ కుటుంబం మరణించింది. తమిళనాడుకు చెందిన అనే ఓ వ్యక్తి, తన పదేళ్ళ కూతురుతోపాటు వెళ్తున్న కారును ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. ఈ వార్తను వారి కుటుంబానికి తెలియజేయడానికి మృతుడి దగ్గర దొరికిన ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా, ఇంటి దగ్గర ఎవరూ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు సమాచారం చెప్పడం కోసం ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ మృతుడి భార్య కూడా చనిపోయి కనిపించింది. మృతుడు ఒమన్‌లోని సోహర్ స్టీల్ కంపెనీలో పని చేసేవాడు. ఆయన భార్య ఎల్ అండ్ టి సంస్థలో పనిచేసేది. కుమార్తె నాలుగో తరగతి చదువుతోంది. ఈ కుటుంబం మొత్తం ఒకేసారి చనిపోవడం మిస్టరీగా మారింది. తండ్రీ కూతురున్న వాహనాన్ని ట్యాంకర్ ఢీకొందా... లేక ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వారే ట్యాంకర్‌కి వాహనాన్ని అడ్డు తెచ్చారా అనేది తేలాల్సి వుంది. మొత్తమ్మీద కుటుంబ తగాదాల వల్ల ఈ మరణాలు సంభవించాయని ఒమన్ పోలీసులు అనుమానిస్తున్నారు.