గుంటూరులో టీడీపీ నేత దారుణహత్య..

గుంటూరు నగరంలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యాడు. నగరంలోని ఓబుళనాయుడుపాలెంలో టీడీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏమినేడి వెంకటేశ్వరరావు దారుణహత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్‌కు వెళుతున్న వారికి రక్తపు మడుగులో పడి ఉన్న వెంకటేశ్వరరావును గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆయన్ను తెల్లవారుజామున దుండగులు హత్య చేసి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా తెలుగుదేశంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.