Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రా నేతల బూట్లు నాకారు...
posted on: Mar 25, 2015 12:16PM
.jpg)
ఈ మధ్య అసెంబ్లీల్లో చర్చల కంటే గొడవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు మన నాయకులు. తెలంగాణా అసెంబ్లీలో బుధవారం మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. మహబూబ్ నగర్ జిల్లాలో విద్యుత్ ప్రాజెక్టు అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మళ్లీ నోటికి పని చెప్పారు. డీకె అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన జగదీశ్ రెడ్డి చాలా నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీనికి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ... ఆంధ్రా నేతల బూట్లు నాకారని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ వ్యాఖ్యలకు సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలంటూ స్పీకర్ పోడీయం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.






