మంత్రి బాలినేని ఇంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు!.. ఆట మొదలైందా?

టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరుతున్నారన్న వార్తలు నిజమయ్యేలా ఉన్నాయి. తాజాగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మంత్రి బాలినేని ఇంటికి వెళ్లి మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీని వీడి అధికార పార్టీ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరూ ఎమ్మెల్యేలు తుది చర్చల్లో భాగంగానే మంత్రి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్.. ఈరోజు సాయంత్రం లేదా రేపు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. వీరిబాటలోనే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా పయనించనున్నారని సమాచారం.