Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీ... కేవలం రెడ్డి పార్టీ మాత్రమేనట
posted on: Oct 6, 2015 1:15PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.... రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి లింగారెడ్డి ఆరోపించారు, వైసీపీ... రెడ్డి కమ్యూనిటీకి మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తుంటే, టీడీపీ అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నామని, ఇటీవల ప్రకటించిన టీడీపీ కమిటీలను చూస్తే అది తెలుస్తుందన్నారు, ఏపీ, తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా బీసీలను పార్టీ నియమించిందని గుర్తుచేసిన లింగారెడ్డి... వైసీపీలో మాత్రం రెడ్డి కమ్యూనిటీకి తప్ప మిగతా సామాజిక వర్గాలకు అసలు విలువే లేదని ఆరోపించారు, వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే... టీడీపీ పబ్లిక్ అన్ లిమిటెడ్ కంపెనీ అంటూ లింగారెడ్డి కొత్త అర్థం చెప్పుకొచ్చారు.



.jpg)


