దారుణం.. మూడేళ్ల పసి పిల్లాడిని జైల్లో పెట్టిన పోలీసులు

 

తమిళనాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని మూడేళ్ల పసి పిల్లాడిని జైల్లో పెట్టారు పోలీసులు. వివరాల ప్రకారం.. తమిళనాడులోని మదురై సమీపంలో ఓ జాతర జరుగుతుండగా.. అక్కడికి ఓ కుటుంబం బొమ్మలు అమ్ముకోవడానికి వచ్చింది. అయితే ఈ జాతరలో మఫ్టీలో వచ్చిన పోలీసులు దొంగతనం చేశారంటూ సదరు బాలుడి తండ్రి, అత్తయ్య, మామయ్యలను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వారితో పాటు ఆ పసి బాలుడిని కూడా తీసుకెళ్లారు. తల్లి మేరీ ఎంత చెబుతున్నా వినకుండా పోలీసులు బాలుడ్ని తీసుకెళ్లి.. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే బాలుడి తల్లి తన కొడుకున అప్పగించాలని కోర్టును కోరినా.. న్యాయమూర్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా వారికి 35 రోజుల కస్టడీ విధించారు. దీంతో ఆమె మదురైలోని మద్రాస్ హైకోర్టు బెంచ్‌లో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు.. తల్లి సంరక్షణ లేకుండా బాలుణ్ని జైలుకు ఎందుకు పంపారంటూ పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలుణ్ని అరెస్టు చేసిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బాలుడికి రిమాండ్ విధించిన జడ్జి నుంచి వివరణ కోరింది. మరి పెద్ద పెద్ద నేరాలు, దొంగతనాలు, హత్యలు చేసిన వాళ్లని అంత తొందరగా పట్టుకొని, శిక్షించ విధించలేని పోలీసులకు మూడేళ్ల బాలుడు దొరికినట్టున్నాడు కస్టడీ విధించడానికి..