ఓట్లను పునరుద్దరించాకే ఎన్నికలు నిర్వహించాలి.. ఎమ్మెల్యేల ధర్నా


జీహెచ్ఎంసీ ఎదుట టీ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా ఓట్లు తొలగించారని, డివిజన్ల విభజన అస్తవ్యస్తంగా చేశారని ఆరోపించారు. ప్రభుత్వంతో అధికారులు కుమ్మక్కయి 25 లక్షల పరిధిలో ఓట్లను తొలగించారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ప్రభత్వం ఇలాంటి కుట్రలు పన్నింది.. కానీ తొలగించిన ఓట్లను పునరుద్దరించాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ధర్నా చేపట్టిన ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అయితే పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొంత మంది నేతలు కిందపడియారు. కాగా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu