మా అమ్మ ఎలా చనిపోయిందో తేల్చాలి

 

కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణం విష ప్రయోగం కారణంగానే జరిగిందని ఎయిమ్స్ వైద్యుల బృందం రిపోర్టు ఇవ్వడంతో తన తల్లి మరణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె కుమారుడు శివ్ పుష్కర్ మీనన్ ఢిల్లీ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. అలాగే, తన తల్లి మరణంపై వెల్లువెత్తుతున్న వివిధ రకాల ఊహాగానాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దుబాయిలో నివశిస్తున్న శివ్ ఢిల్లీ పోలీసులకు ఈ విషయమై ఓ లేఖ రాశాడు. తన తల్లి సునంద పుష్కర్ మరణం వెనుక దాగి ఉన్న వాస్తవాలను వీలైనంత త్వరలో వెల్లడి చేయాలని, ఈ దర్యాప్తులోఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా వ్యవహరించాలని కోరాడు. ఇప్పటికే తల్లి మరణంతో తీవ్ర విచారంలో కూరుకుపోయిన తమను, తల్లి మరణంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఊహాగానాలు మరింత కుంగదీస్తున్నాయని శివ్ పుష్కర్ తన లేఖలో పేర్కొన్నాడు.