ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదల...

 

ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో బాలికలు 94.77 శాతం, బాలురు 94.33 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే మూడు శాతం ఉత్తీర్ణత పెరిగిందని.. కడపజిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, చిత్తూరుజిల్లా చివరిస్థానంలో ఉన్నట్టు తెలిపారు. అంతేకాదు జూన్ 16 నుండి అడ్వాన్స్ డ్ సంప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలియజేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu