ఏపీ ప్రత్యేక హోదా... రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ధర్నాలు

 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. కాకినాడలో నిర్వ‌హించ‌నున్న‌ ధర్నాలో వైసీపీ అధినేత‌ వైఎస్‌ జగన్ పాల్గొన‌నున్నారు. ఏలూరు ధ‌ర్నాలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌, మేకా శేషుబాబు పాల్గొన‌నున్నారు. తిరుపతిలో వైఎస్‌ఆర్‌సీపీ నేత భూమనకరుణాకర్ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర్నాలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల ముందు వైసీపీ నేత‌లు నిర‌స‌న తెలియ‌జేయ‌నున్నారు.