రాత్రికి భారత్ చేరుకోనున్న శ్రీదేవి మృతదేహాం

వివాహా కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించిన సినీనటి శ్రీదేవి భౌతికకాయం.. రాత్రి 7 గంటల సమయంలో భారత్‌కు చేరుకోనుంది. ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ముంబై నుంచి ప్రత్యేక విమానం దుబాయ్‌కి బయలుదేరి వెళ్లింది. అక్కడ లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని ఆ విమానం తిరిగి 4 గంటలకు భారత్‌కు తిరిగి రానుంది. రేపు మధ్యాహ్నాం 2 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. బోనీకపూర్ నివాసం నుంచి మెహబూబా స్టూడియోకి ఆమె పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాళుల అనంతరం శాంతాక్రూజ్ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News