రాత్రికి భారత్ చేరుకోనున్న శ్రీదేవి మృతదేహాం

వివాహా కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించిన సినీనటి శ్రీదేవి భౌతికకాయం.. రాత్రి 7 గంటల సమయంలో భారత్‌కు చేరుకోనుంది. ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ముంబై నుంచి ప్రత్యేక విమానం దుబాయ్‌కి బయలుదేరి వెళ్లింది. అక్కడ లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని ఆ విమానం తిరిగి 4 గంటలకు భారత్‌కు తిరిగి రానుంది. రేపు మధ్యాహ్నాం 2 గంటలకు శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. బోనీకపూర్ నివాసం నుంచి మెహబూబా స్టూడియోకి ఆమె పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నివాళుల అనంతరం శాంతాక్రూజ్ శ్మశాన వాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.