టీఆర్ఎస్ పార్టీ పాలించమంటే దళారీ చేస్తున్నారు.. ఎర్రబెల్లి

టీడీపీ ఎమ్మెల్యే సాయన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యేని చేర్చుకున్నంత మాత్రనా టీడీపీని బలహీన పరచలేరని.. మంత్రులు పాలనను వదిలేసి ఎంపీటీసీలను కొనే పనిలో పడ్డారు అని విమర్శించారు. అధికార పార్టీ క్యాంప్ ఆఫీసు, సచివాలయాన్ని టీఆర్ఎస్ ఆఫీసులుగా మార్చారు అని మండిపడ్డారు. పాలించాలని అధికారమిస్తే గులాబీ నేతలు దళారీ పని చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ కేసీఆర్ తో భేటీ అయి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన సంగతి విదితమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu