ఎపిఎన్జీవోలో విభేదాలు

 

 

 

ఏపీఎన్జీవోలలో విభేదాలు మొదలయ్యాయి. తన స్వార్ధ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు అశోక్ బాబు ఉద్యోగులను బలి చేస్తున్నారని, ఇంతవరకు ఆయన ఏపీఎన్జీవోల సంఘానికి వచ్చిన విరాళాల గురించి చెప్పడం లేదని, హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ పెట్టినప్పుడు అమ్మిన కూపన్ల గురించి చెప్పడం లేదని ఏపీఎన్జీఓ నేత సుబ్బరాయన్ విమర్శించారు. అశోక్ బాబు రాజకీయ పార్టీ పెట్టడానికి రిజిస్టర్ చేశారని, ఆయనకు పార్టీ పెట్ట దలచుకుంటే, రాజకీయాల్లోకి వెళ్ల దలచుకుంటే వెంటనే ఏపీఎన్జీఓల సంఘం నుండి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన సొంత విషయంగా ఆశోక్ బాబు చూస్తున్నారని ఆయన విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu