టీ. ఏసీబీకి సుప్రీం దిమ్మతిరిగే సమాధానం

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా.. బెయిల్ రాకుండా చాలా కష్టపడ్డారు పాపం తెలంగాణ ఏసీబీ అధికారులు. కానీ హైకోర్టు మాత్రం ఏసీబీ చెప్పిన కుంటి సాకులను తోసిపుచ్చి రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసి ఏసీబీ అధికారులకు మొట్టికాయ వేసింది. అంతటితో ఊరుకున్నారా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ లో దాఖలు చేసింది. అంతేకాదు రేవంత్ రెడ్డి జైలు నుండి విడుదలైనపుడు చేసిన ప్రసంగాన్ని కూడా సుప్రీంకోర్టుకు అందించి ఇంకేముంది రేవంత్ బెయిల్ రద్దు చేయోచ్చు అనుకున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా ఏసీబీ వేసిన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి వారిక దిమ్మతిరిగి పోయే సమాధానం ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని నెల రోజుల పాటు జైలులోనే ఉంచి.. నాలుగు రోజులు కస్టడీలో విచారణ జరిపారు. మళ్లీ అతడిని కస్టడీకి తీసుకొని ఏం చేస్తారు అని ప్రశ్నించింది. రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తాము సమర్ధిస్తున్నామని.. రేవంత్ కు బెయిల్ మంజూరు చేయడంపై హైకోర్టు సహేతుకమైన కారణాలే పేర్కొందని ధర్మాసనం తెలిపింది. కనుకు రేవంత్ రెడ్డిని ఇంకా జైలులోనే ఉంచాల్సిన అవసరం లేదని.. ఒకవేళ రేవంత్ బెయిల్ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే అప్పుడు తమ తలుపు తట్టవచ్చని తెలంగాణ ఏసీబీ అధికారులకు సుప్రీం సూచించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu