రేవంత్ బెయిల్ పిటిషన్ నేడే హైకోర్టులో విచారణ

 

ఓటుకునోటు వ్యవహారంలో అరెస్ట్ అయిన తెదేపా ఎమల్యే రేవంత్ రెడ్డి తదితరుల బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టు విచారణకు చేపట్టనుంది. వారితో బాటు ఈ కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు విచారణకు చేపడుతుంది. ఎసిబి అధికారులు వారికి బెయిలు మంజూరు చేయవద్దని కోరుతూ ఒక కౌంటర్ దాఖలు చేసారు. ఈ కేసులో తనను ప్రశ్నించడం పూర్తయింది కనుక తనను ఇంకా జైల్లో ఉంచడానికి తగిన బలమయిన కారణాలేవీ లేవని కనుక తనకు బెయిలు మంజూరు చేయవలసిందిగా రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు బెయిల్ మంజూరు చేసినట్లయితే కోర్టు విధించే షరతులకు లోబడి ఉంటానని హామీ ఇచ్చారు. కనుక ఈరోజు హైకోర్టు రేవంత్ రెడ్డితో సహా మిగిలిన ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తుందా లేదా? అనే విషయం తేలిపోవచ్చును.