నటుడు రాజేంద్రప్రసాద్‌కి షాక్

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల స్థాయిలో పోటాపోటీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్ష పదవి కోసం నటి జయసుధ, నటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడుతున్నారు. అయితే జయసుధ వైపే సినిమా పరిశ్రమ ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో మా ప్యానల్‌నే గెలిపించండంటే జయసుధ, రాజేంద్రప్రసాద్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్‌కి ఒక షాక్ తగిలింది. రాజేంద్ర ప్రసాద్ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా శివాజీరాజా, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ పోటీలో నిలిచారు. అయితే బుధవారం నాడు వీరిద్దరూ తాము పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇది రాజేంద్రప్రసాద్‌కి షాక్ లాంటిదే.